Jaya Jaya He Telangana: ఒకటిన్నర నిమిషం నిడివిలో జయ జయహే తెలంగాణ, సంగీతం అందించనున్న సంగీత దర్శకుడు కీరవాణి, జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం
ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్, తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..
జూన్ 2వ తేదీ ఈ గీతాన్ని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో విడుదల చేయించేదుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే అందెశ్రీ, కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలాబాగుందని రేవంత్ కితాబిచ్చారు. అయిదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే రాష్ట్రం గీతంగా ప్రకటించారు.
Here's Update
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణకు సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు కీరవాణి.. pic.twitter.com/YM6rDSSXwl
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024
ఈ రెండు చరణాల్లో తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనున్నది. జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది
(The above story first appeared on LatestLY on May 21, 2024 06:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

