![](https://test1.latestly.com/wp-content/uploads/2020/04/01-380x214.jpg)
Hyderabad, October 22: తెలంగాణలో కొవిడ్ తీవ్రత నియంత్రణలోకి వస్తోంది, ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఇటీవలి కాలంగా 15 వందల లోపే ఉంటోంది. అయితే కొవిడ్ టెస్టులు కూడా ఒకరోజు ఎక్కువగా, ఒకరోజు తక్కువగా ఉండటం గమనార్హం.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 38,565 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1456 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,110 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,78,869 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,27,580కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 254 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 98, మేడ్చల్ నుంచి 98, నల్గొండ నుంచి 92, ఖమ్మం నుంచి 88 మరియు నల్గొండ కొత్తగూడెం నుంచి మరో 82 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts1-14.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts2-14.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 05 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1292కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 1717 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,06,105మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,183 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.