కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు అక్కినేని నాగార్జున(Nagarjuna Meets Modi). పార్లమెంటులో అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి ప్రధానిని కలిశారు నాగ్.
దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ బుక్ లాంచ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని నాగార్జున కోరగా ఆవిష్కరించారు.
ఇటీవల మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరావు(Akkineni Nageshwarrao) గురించి మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలపగా నాగ చైతన్య కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Akkineni Nagarjuna family meets PM Modi
కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసిన అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ. https://t.co/KEcV5AUsMJ pic.twitter.com/c2Z76HOoYr
— ChotaNews App (@ChotaNewsApp) February 7, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)