Hyderabad Shocker: సోషల్ మీడియాలో పరిచయం, అర్థరాత్రి ఇంటిలోకి దూరి బాలికపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని అర్థరాత్రి ఇంటిలోకి దూరిన ఓ యువకుడు (Telangana Shocker) 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి (Minor girl 'raped' by teenage boy) పాల్పడ్డాడు.

Hyderabad Shocker: సోషల్ మీడియాలో పరిచయం, అర్థరాత్రి ఇంటిలోకి దూరి బాలికపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image used for representational purpose | (Photo Credits: File Image)

Hyderabad, July 26: భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని అర్థరాత్రి ఇంటిలోకి దూరిన ఓ యువకుడు (Telangana Shocker) 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి (Minor girl 'raped' by teenage boy) పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాంకాలనీలో నివసించే కుటుంబం కులవృత్తి చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నారు. ఈనెల 3న తల్లిదండ్రులు ఏలూరులోని చుట్టాల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు.

ఇంట్లో వారిద్దరి కూతుళ్లకు తోడుగా తమ బంధువైన ఓ బాలికను తోడుగా ఉంచారు. వారి పెద్ద కూతురు(16)కు సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆరు నెలలుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. బాలికల ఇంట్లో పెద్దలు ఎవరూ లేరని తెలుసుకున్న అతను ఈనెల 5న రాత్రి వారింట్లోకి చొరబడ్డాడు. ఆ బాలికకు తోడుగా ఉన్న ఇద్దరు పిల్లలను అరిస్తే చంపుతానని బెదిరించాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడి తెల్లవారు జామున ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులు భయంతో ఉన్న బాలికలను అడిగినా ఏమి చెప్పలేదు.

చెల్లిని ప్రేమించాడని మర్మాంగాన్నే కోసేశారు, తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితుడు మృతి, ఆగ్రహంతో లవర్ ఇంటి ముందే అంత్యక్రియలు నిర్వహించిన మృతుడి బంధువులు, బీహార్ ముజఫర్‌ఫూర్‌ జిల్లాలో దారుణ ఘటన

ఈనెల 12న మనస్తాపంతో ఆ బాలిక ఇంట్లోని శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స చేయించి తీసుకొచ్చిన తల్లి చుట్టాల అబ్బాయి ద్వారా కూపీ లాగింది. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. వెంటనే బాలిక తల్లి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 26, 2021 11:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).