Warangal Shocker: రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్త, తట్టుకోలేక మర్మాంగాలు కోసి హత్య చేసిన భార్య, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Warangal, Sep 22: తెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ తాగొచ్చి భర్త వేధిస్తున్నాడని ఓ భార్య నిద్ర పోతున్న భర్తను దారుణంగా హత్య (Woman kills alcoholic husband) చేసింది. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా (Warangal), మరిపెడ మండలంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలో వాంకుడోతు తండాకు చెందిన భర్త భూక్యా బీచ్యా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగారావడమే కాకుండా కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు.భర్త అరాచకాలతో విసిగిపోయిన భార్య భర్తను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత భర్త మర్మాంగాలను కోసి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రేమికులను దారుణంగా హింసించిన గ్రామస్థులు, మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయాలని ఒత్తిడి, ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

కాగా తన తల్లి హత్య కేసులో భూక్యా బీచ్యా ప్రధాన నిందితుడు. కొద్ది రోజుల క్రితమే శిక్ష అనుభవించి.. జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధిస్తుండేవాడు. భర్త వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడింది.