![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/coronavirus-screening-pti-380x214.jpg)
Hyderabad, October 16: తెలంగాణలో కొవిడ్ తీవ్రత నియంత్రణలోకి వస్తోంది, ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల లోపే ఉంటుంది, మరోవైపు దాదాపు అదే స్థాయిలో ఈ వ్యాధి నుండి కోలుకునే వారి సంఖ్య ఉండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూపోతుంది.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 43,916 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1554 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 831 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 37,46,963 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,19,224కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 249 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 128, మేడ్చల్ నుంచి 118 కేసులు నిర్ధారణయ్యాయి.
పలు జిల్లాల్లో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది, నిన్న ఒక్కరోజే కొత్తగూడెం నుంచి మరో 95 పాజిటివ్ కేసులు, అలాగే ఖమ్మం నుంచి 88, కరీంనగర్ నుంచి 84 మరియు నల్గొండ నుంచి 79 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts1-10.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts2-10.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 07 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1256కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1435 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,94,653 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,203 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.