Jio New Offer: జియో తాజా ఆఫర్, రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి నాలుగు డిస్కౌంట్ కూపన్లు, జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఆఫర్
Jio reveals 2 affordable Rs 98 and Rs 149 prepaid plans, gives up to 1GB daily data (Photo-Twitter)

Mumbai, June 3: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ను ( Jio New offfer) ప్రకటించింది. రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి ఒకే విలువ గల నాలుగు డిస్కౌంట్ కూపన్లను ఇస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ వేర్, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో

రీచార్జి చేసుకున్న తర్వాత ఈ కూపన్లు మైజియో యాప్ లో జమ అవుతాయని... షాపింగ్ చేసేటప్పుడు కూపన్లను రీడీమ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఇది వరకే రీచార్జ్‌ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌కు అర్హులని సంస్థ ప్రకటించింది. అయితే అడ్వాన్స్ రీచార్జ్‌ చేసుకున్న వారు మై జియో యాప్‌లోని మై ప్లాన్స్‌ సెక్షన్‌లో ఆఫర్‌కు సంబంధించిన వివరాలుంటాయని తెలిపింది. ఈ ఆఫర్‌ జూన్ 1 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ సడలింపు వల్ల తమ ఆఫర్‌ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని సంస్థ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.