
Newdelhi, Apr 29: వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను (Eye Problems) గుర్తించేందుకు రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలియం(ఆర్పీఈ-RPE) ఉత్పరివర్తనాలు సహకరిస్తాయని ఎల్వీ ప్రసాద్ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది. వారసత్వంగా కంటి సమస్యలున్న 260 మంది జన్యువులతో సీక్వెన్సింగ్ చేయడం వలన రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలీయం లోపాలను గుర్తించినట్లుగా తేల్చారు. చిన్న వయసులోనే ఈ లోపాలను గుర్తిస్తే సవరించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
