SSLV D3 (Credits: X)

Newdelhi, Aug 16: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 (SSLV-D3) ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహక నౌక 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం కొనసాగింది. ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు

ఉపయోగం ఏమిటి?

విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈవోఎస్-08 ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఈ శాటిలైట్ పర్యవేక్షణ పెట్టనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు