Karnataka Bitcoin Scam: కర్ణాటకను కుదిపేస్తున్న బిట్ కాయిన్ స్కాం వెనుకున్న హ్యాకర్ ఇతడే, వయస్సు 25 ఏళ్లే...

కాలేజీలో ఉండగానే మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడిన రమేష్.. ఇందుకోసం డబ్బు సంపాదించేందుకు పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు. అతను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసి డార్క్ నెట్‌లో డ్రగ్స్ కొనడానికి ఉపయోగించేవాడు.

Karnataka Bitcoin Scam: కర్ణాటకను కుదిపేస్తున్న బిట్ కాయిన్ స్కాం వెనుకున్న హ్యాకర్ ఇతడే, వయస్సు 25 ఏళ్లే...
(Image Credit: ANI)

కర్ణాటకలో దాదాపు ఏడాది తర్వాత మరోసారి బిట్‌కాయిన్ స్కామ్‌పై రచ్చ మొదలైంది. ఇది పెద్ద కుట్ర అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. 'బిగ్ బాస్' శ్రీక్కిని కలవండి, పోలీసులను కూడా మోసం చేసిన హ్యాకర్లు వీరే అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కుంభకోణంలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఆ రాజకీయ నాయకులకు సాయం చేసేందుకు దర్యాప్తు అధికారులు కేసును అణిచివేసేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోందని సిద్ధరామయ్య తన ట్వీట్ లో రాశారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించరాదని ఆయన ఆరోపించారు.

స్కాంలో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణ రమేష్ ఎవరు?

శ్రీకృష్ణ  4వ తరగతిలో ఉన్నప్పటి నుండి కంప్యూటర్‌లపై ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఇక్కడి నుండి కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ప్రారంభించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. శ్రీ కృష్ణ తన పాఠశాల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడని, దానితో అతను తన హాజరు , మార్కులను మార్చేవాడని చెప్పారు. దీని తర్వాత 8వ తరగతికి రాగానే బ్లాక్ క్యాట్ హ్యాకర్ గా మారాడు.

ఆ తర్వాత ఇంటర్నెట్ రిలే చాట్ (ఐఆర్‌సీ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లతో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. బ్లాక్ క్యాట్ హ్యాకర్ల ప్రపంచంలో, శ్రీ కృష్ణ రమేష్‌ని 'రోజ్' , 'బిగ్ బాస్' అని పిలుస్తారు.

కాలేజీలో ఉండగానే మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడిన రమేష్.. ఇందుకోసం డబ్బు సంపాదించేందుకు పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు. అతను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసి డార్క్ నెట్‌లో డ్రగ్స్ కొనడానికి ఉపయోగించేవాడు.

అయితే నవంబర్ 2020లో రమేష్ సహచరులు కొందరు గంజాయిని సేకరించేందుకు బెంగళూరులోని పోస్టాఫీసుకు వెళ్లారు, వారిని అరెస్టు చేశారు. డార్క్‌నెట్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు బిట్‌కాయిన్ ట్రేడింగ్ సర్వీస్ నడుపుతున్న రాబిన్ ఖండేల్వాల్ అనే వ్యక్తికి రమేష్ డబ్బు బదిలీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో రమేష్‌ అసలు బండారం బయటపడింది. ఆ సమయంలో రమేష్ నుంచి రూ.9 కోట్ల విలువైన 31 బిట్‌కాయిన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఆస్తులపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది.

శ్రీ కృష్ణ రమేష్ 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్. బెంగుళూరులోని జయనగర్‌లో నివాసముంటున్న రమేష్ ఇక్కడి నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసి కంప్యూటర్ సైన్స్‌లో తదుపరి చదువులు చదివేందుకు 2014లో ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లాడు. ఆమ్‌స్టర్‌డామ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, రమేష్ అనేక హ్యాకింగ్‌లలో పాల్గొన్నాడు. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి డబ్బు సంపాదించిన రమేష్ అతనితో కలిసి డ్రగ్స్ పార్టీ చేసేవాడు. 2018లో అతడిపై కేసు కూడా నమోదైంది.

(The above story first appeared on LatestLY on Nov 07, 2021 03:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).