I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదంపై హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. సమ్మెపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి.
సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గగనతలంలో దుమ్మురేపుతోంది. ఈ యుధ్ద విమానంతో భారత వైమానిక దళం చేపట్టిన గగన విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.
మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు ఫైనల్కి చేరాయి. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా జరపనున్నారు.
గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రోడ్లనీ నదులను తలపిస్తున్నాయి.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత పాకిస్థాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్పై వాయుదాడులకు ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేస్తున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వస్తున్నవారందరికీ తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మామ పుట్టిన రోజుకు ఊహించని బహుమతి ఇవ్వాలనుకున్న అల్లుడు మామా చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.
ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన గడువు పూర్తయింది. సాయంత్రం ఆరుగంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తోంది.
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు.
కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుందనే సామెత ఈ స్టోరీకి అక్షరాల సరిపోతుంది. తెలివిగా స్మగ్లింగ్ చేద్దామనుకున్న ఓ యువకుడు కాలం కలిసిరాక అడ్డంగా బుక్కైపోయాడు. ఈ ఘటన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో రిలయన్స్ డిజిటల్ కూడా ఆఫర్ల సునామికి తెరలేపింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ రిటైల్ అవుట్లెట్లలో లభించే ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై 15 శాతం క్యాష్బ్యాక్, యాక్సెసరీస్లపై మరో 10 శాతం అదనపు రాయితీని ఇస్తున్నది.
గత కొన్ని రోజులుగా ఇరాక్లో ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ యత్నించినా ప్రజలు ఏమాత్రం లెక్కలేయటంలేదు.
ఇది చాలా విచిత్రమైన కేసు. ప్రపంచంలోనే మొదటి కేసు అని కూడా చెప్పవచ్చేమో.. టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ లోని ఓ యాప్ ఓ యువకుడిని గేగా మార్చింది. దీంతో అతను ఆపిల్ పే కేసు వేశాడు.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల వికెట్ల మార్కును చేరిన ఎడమ చేతి వాటం బౌలర్గా సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు.
ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో గత కొద్ది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు.
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి కొత్త స్కెచ్ వేశారు. ఈ టికెట్ బాదుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు కొత్త రూట్లో వెళుతున్నారు.
దేశంలో పెరిగిపోతున్న మూక దాడులను తక్షణం ఆపాలని, జైశ్రీరాం నినాదం కొందరు నేరస్తుల చేతిలో ఆయుధంగా మారిందంటూ దేశంలోని 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి విదితమే. కాగా మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన ఈ 49 మంది సెలబ్రిటీలపై బిహార్ లోని ముజఫర్పూర్ లో కేసు నమోదైంది.