Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Anand Mahindra To Step Down As Mahindra & Mahindra Executive Chairman From April 1 (Photo-PTI)

Mumbai,December 20: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే అదే రోజు నుంచి మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా సీఈవో‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా గ్రూప్ కంపెనీ ససాంగ్యోంగ్ మోటర్స్ చైర్మన్ గా కూడా రిటైర్డ్ అయ్యేవరకు గోయెంకా (Pawan Goenka)కొనసాగనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్-1,2021న గొయెంకా రిటైర్మెంట్ తరువాత ఎండీ,సీఈవో బాధ్యతలను అనిష్ షా చేపడతారని కంపెనీ తెలిపింది.

నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా ...మేనేజింగ్ డైరెక్టర్ కోసం బోర్డుకు సమర్పించాల్సిన సమస్యలపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రణాళిక, రిస్క్ తగ్గించడం మరియు బాహ్య ఇంటర్ఫేస్ రంగాలలో ఒక గురువు మరియు సౌండింగ్ బోర్డుగా పనిచేస్తారని కంపెనీ తెలిపింది.

Here's Mahindra tweet

తన కొత్త రోల్ లో... మహీంద్రా గ్రూప్ యొక్క మనస్సాక్షి కీపర్ గా, దాని విలువలకు సంరక్షకునిగా,దాని వాటాదారుల ప్రయోజనాలను చూసేవాడిగా నేను ఉంటాను అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. కంపెనీ అంతర్గత ఆడిట్ యూనిట్ తనకు రిపోర్ట్ చేయడం కొనసాగుతుందని ఆయన అన్నారు.

అనీష్ షా ఏప్రిల్ 2021 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా నియమితులయ్యారు. ఏప్రిల్ 2, 2021 తరువాత, అతను గోయెంకా స్థానంలో నాలుగేళ్ల కాలానికి కంపెనీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు.. అతని పదవీకాలం 2025 మార్చి 31 తో ముగుస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1న అనిశ్‌ సిన్హా డిప్యూటీ ఎండీ, సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎఫ్‌వో పార్థసారథి కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. రానున్న 15 నెలల్లో సంస్థలోని కీలక పదవుల్లో ఉన్న వారు పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది.ఈ మార్పులను కంపెనీ ప్రకటించడంతో ఎం అండ్‌ ఎం షేరు స్వల్ప నష‍్టంతో కొనసాగుతోంది.

(The above story first appeared on LatestLY on Dec 20, 2019 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).