Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
సినీ నటుడు అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad, Dec 24: సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీకి చెందిన నేతలు ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని తెలంగాణ పీసీసీకి సీఎం స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
అల్లు అర్జున్ వ్యవహారం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ సూచనలు
మీడియా సమావేశాలు, చర్చల్లో అల్లు ఎపిసోడ్పై మాట్లాడొద్దన్న రేవంత్
పార్టీ నాయకులు కూడా మాట్లాడకుండా చూడాలని పీసీసీకి ఆదేశం pic.twitter.com/13D5VcsYkS
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2024
లీగల్ టీంతో భేటీ అయిన అల్లు అర్జున్
నేటి ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్ లో విచారణకు బన్నీ వెళ్ళనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ తన లీగల్ టీంతో భేటీ అయ్యారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 24, 2024 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

