Nagarjuna: అభిమానికి క్షమాపణలు తెలిపిన అక్కినేని నాగార్జున.. ఎందుకంటే??
టాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు.
Hyderabad, June 24: టాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని (Fan) ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. సదరు అభిమానిని నిర్దయగా పక్కకు ఈడ్చి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించారు. విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరిగి ఉండకూదని విచారం వ్యక్తం చేశారు. ‘ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నా’ అని నాగార్జున పేర్కొన్నారు.
This just came to my notice … this shouldn’t have happened!!
I apologise to the gentleman 🙏and will take necessary precautions that it will not happen in the future !! https://t.co/d8bsIgxfI8
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2024
నాగ్ కు తెలియకుండానే..
నిజానికి తనను కలిసేందుకు అభిమాని వస్తున్న విషయం నాగ్ గమనించలేదని.. ఒకవేళ.. ఆయన గమనిస్తే, అప్పుడే నాగ్ స్పందించేవారని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 24, 2024 10:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

