Tollywood New Guidelines: టాలీవుడ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయి, నిర్మాతలు తీసుకున్న కొత్త నిర్ణయాలు విడుదల, సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..

తెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌.

Tollywood New Guidelines: టాలీవుడ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయి, నిర్మాతలు తీసుకున్న కొత్త నిర్ణయాలు విడుదల, సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..
Tollywood Logo

తెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌. ఆ ప్రకటనలో నటీనటుల రెమ్యూనరేషన్ లు, కాల్‌ షీట్లు వివరాలు, ఓటీటీ-శాటిలైట్‌ హక్కులు వంటి అంశాలపై కొత్త మార్గదర్శకాలని విడుదల చేసింది. ఈ నెల(సెప్టెంబర్) 10 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

సినిమా నిర్మాణానికి సంబంధించి నిర్ణయాలు ఇవీ.

* నటులు/ సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాల చెల్లింపులు ఉండవు.

* పర్సనల్‌ స్టాఫ్‌, లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హోటల్‌ బస, ప్రత్యేక ఆహారం లాంటివన్నీ కలుపుకునే రెమ్యూనరేషన్‌ లెక్కేస్తారు. అంటే అందులోనూ అన్నీ చూసుకోవాలి.

* పాత్రలు, చిత్రాలను బట్టి రెమ్యూనరేషన్‌ను నిర్మాత నిర్ణయిస్తారు.

* ఒప్పందానికి మించి నిర్మాతలు నేరుగా నగదు లాంటివి ఇవ్వకూడదు. కీలక సాంకేతిక నిపుణుల విషయంలోనూ ఇదే నిర్ణయం వర్తిస్తుంది.

* ఆయా సినిమాల చిత్రీకరణ ప్రారంభంలోనే అగ్రిమెంట్‌ చేసుకోవాలి. వాటికి తప్పనిసరిగా ఛాంబర్‌ ఖరారు చేయాలి.

* స్క్రిప్టు అప్‌డేట్స్‌, కాల్‌ షీట్లు లాంటి కీకల వివరాలను రోజూ నోట్‌ చేయాలి.

ఓటీటీ విషయంలో కొత్త మార్గదర్శకాలు ఇవీ.

* ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలి.

* ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు ఏ సంస్థలు దక్కించుకున్నాయి అనే వివరాలను టైటిల్‌ కార్డ్స్‌లో, ప్రచారంలో ప్రకటించకూడదు

సినిమా పంపిణీ, ప్రదర్శన విషయంలో ఇలా..

* వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయట. ఆరో తేదీన మరోసారి భేటీ అయ్యి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

* తెలంగాణలో తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లకు కూడా వీపీఎఫ్‌ పర్సెంటేజీ అందుతుందట.

ఫెడరేషన్‌ విభాగానికి సంబంధించి..

* ఫెడరేషన్‌ గురించి ఇంకా చర్చలు తుది దశలో ఉన్నాయట. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చాక. రేట్‌ కార్డుల వివరాలను త్వరలో అన్ని నిర్మాణ సంస్థలకు అందిస్తారు.

(The above story first appeared on LatestLY on Sep 02, 2022 05:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).