CBSE 10th, 12th Board Exam 2020: జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీలను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
SSC Exams 2020 | (Photo-PTI)

New Delhi, May 8: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్ష తేదీలను (CBSE 10th, 12th Board Exam 2020) గురువారం ప్రకటించారు. జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. దేశంలో COVID-19 లాక్డౌన్ కారణంగా చాలా ఆలస్యం తరువాత ఈ పరీక్షలు జరుగుతున్నాయి.  యూనివర్సిటీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయాలని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌

సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంగళవారం మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) రమేష్ పోఖ్రియాల్ ఒక వెబ్‌నార్‌లో తెలిపారు. ఇప్పుడు తేదీలను ప్రకటించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని విశ్వవిద్యాలయాలు 2020 సంవత్సరానికి ఫైనల్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించనున్నాయి, మిగతా విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా పైతరగతులకు వెళ్లవచ్చని తెలిపారు.

ANI Tweet:

కాగా 10 వ తరగతికి నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, వీటికి ఇంకా పరీక్షలు నిర్వహించబడలేదు. 10 వ తరగతి విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సైన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 12 వ తరగతి విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, హిందీ, జియోగ్రఫీ, సోషియాలజీ మరియు బిజినెస్ స్టడీస్ పరీక్షలు రాయల్సి ఉంది. 1 నుంచి 9 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేవు, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, పీజీ మెడికల్‌ సీట్ల ఫీజు పెంపు, జూలైలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తామని తెలిపిన ఎంసీఐ

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) గత నెలలో పెండింగ్ పరీక్షలను విదేశాలలో నిర్వహించబోమని ప్రకటించింది. ఏదేమైనా, విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలతో సహా వారి భవిష్యత్ అవకాశాల గురించి ఆందోళన చెందుతున్న విద్యార్థుల నుండి అనేక ప్రాతినిధ్యాలు మరియు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల నిర్వహిస్తామని ప్రకటన చేసింది.