World’s Fastest Human Calculator: హైదరాబాదీ యువకుడి ఘనత, ప్రపంచంలోనే వేగవంతమైన హ్యూమన్ క్యాలెక్యులెటర్‌గా అవతరణ, లండన్ మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్ నుంచి బంగారు పతకం గెలుపు

యింట్ స్టీఫెన్స్ కాలేజీలో మేథమేటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న భానుప్రకాష్ తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే SIP అబాకస్ ప్రోగ్రామ్ లో చేరి అందులోనే 9 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్....

World’s Fastest Human Calculator: హైదరాబాదీ యువకుడి ఘనత, ప్రపంచంలోనే వేగవంతమైన హ్యూమన్ క్యాలెక్యులెటర్‌గా అవతరణ, లండన్ మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్ నుంచి బంగారు పతకం గెలుపు
Neelakantha Bhanu Prakash | Photo: ANI

Hyderabad, August 26: లండన్‌లోని మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎంఎస్‌ఓ) లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కు చెందిన 21 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాష్ విజేతగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మానవ కాలిక్యులేటర్‌గా అవతరించి ఈ కేటగిరీలో భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన వాడిగా భాను ప్రకాష్ రికార్డ్ నెలకొల్పారు.

ఈనెల ఆగస్టు 15న జరిగిన లండన్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ పోటీలో యుకె, జర్మనీ, యుఎఇ, ఫ్రాన్స్, గ్రీస్, లెబనాన్ సహా 13 దేశాలకు చెందిన 13 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న సుమారు 30 మంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్ లో భానుప్రకాష్ తిరుగులేని పాయింట్లు సాధించి అలవోకగా టైటిల్ సాధించారు. భానుప్రకాష్ తో 65 పాయింట్ల తేడాతో లెబనాన్ కు చెందిన పోటీదారు రెండో స్థానంలో నిలవగా, మూడవ స్థానాన్ని యుఎఇకి చెందిన పోటీదారుడు దక్కించుకున్నాడు.

దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మేథమేటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న భానుప్రకాష్ తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే SIP అబాకస్ ప్రోగ్రామ్ లో చేరి అందులోనే 9 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ '13 మరియు నేషనల్ అబాకస్ ఛాంపియన్ '11 మరియు '12 లను కూడా గెలుచుకున్నారు. వీటితో పాటు అత్యంత వేగంగా గణిస్తూ 50 లిమ్కా బుక్ రికార్డులను కూడా భాను ప్రకాష్ తన ఖాతాలో వేసుకున్నారు.

మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన భానుప్రకాష్ తన మెదడు యాంత్రిక కాలిక్యులేటర్ వేగం కంటే వేగంగా లెక్కిస్తుందని అన్నారు. గణితశాస్త్రంలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి నా వంతు కృషి చేశాను అని భానుప్రకాష్ పేర్కొన్నారు.

అతను సంఖ్య సమస్యలను పరిష్కరిస్తున్న వేగంతో న్యాయమూర్తులు మంత్రముగ్దులను చేశారని మరియు అతని ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మరిన్ని లెక్కలు చేయమని వారు కోరారు.

"విజన్ మాథ్" పేరుతో ల్యాబ్ లను ఏర్పాటు చేసి పిల్లలను గణితం అంటే భయం కాకుండా గణితం అంటే ఇష్టపడేలా చేయాలనేది తన అభిలాష అని భానుప్రకాష్ వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Aug 26, 2020 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).