Earthquake Representative Image (Photo Credit: PTI)

Newdelhi, Nov 20: మహారాష్ట్రలో (Maharastra) భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత గల భూకంపం నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సోమవారం ఉదయం 5.09 గంటల సమయంలో సంభవించిందని, భూఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.

Vinod Bajaj: నడక వీరుడు వినోద్‌ బజాజ్‌.. 1,114 రోజుల్లో 80 వేల కిలోమీటర్ల వాక్‌.. ఇది భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరానికి సమానం.. గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు దరఖాస్తు

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా

తెలంగాణ (Telangana), కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం హింగోలి జిల్లా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 255 కిలోమీటర్లు, నాగ్‌ పూర్‌ కు 265 కిలోమీటర్ల దూరంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.