Newdelhi, Feb 1: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై (Commercial LPG Cylinder Prices) రూ. 7 చొప్పున తగ్గించాయి. దీంతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,797 రూపాయలకు తగ్గింది. నిన్నటి వరకు ఈ ధర 1,804 రూపాయలుగా ఉండేది. కోల్ కతలో రూ. 1,911.50 పైసల నుంచి రూ.1,907.50 పైసలకు తగ్గింది. ముంబైలో రూ. 1,756 నుంచి 1,749 రూపాయలు, చెన్నైలో 1,966.50 పైసల నుంచి 1,959 రూపాయలకు తగ్గింది. తగ్గినా ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న ధర కొనసాగుతోంది.
#BudgetWithHT | Oil marketing companies slashed the price of the 19 kg commercial LPG cylinders by ₹7, ahead of the Union Budget, which will be presented at 11 am in the Lok Sabha.
Read full story : https://t.co/dcLUzT07fR #UnionBudget2025 pic.twitter.com/q7Rwl7l5vJ
— Hindustan Times (@htTweets) February 1, 2025
పెరుగుతాయి అనుకుంటే..
జాతరలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిలిండర్ ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావించారు. కానీ అనూహ్యంగా సిలిండర్ ధర గణనీయంగా తగ్గడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్ పై రూ.14.50 మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వాటి రేట్లు తగ్గుముఖం పట్టాయి.