Tirumala Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Tirumala, July 3: కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) వారాంతం (Weekend) సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex) కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు (Devotees) స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఒకరోజు పాటు భక్తులు క్యూ లైన్లలో ఉండాల్సి వస్తుండడంతో, టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కిచిడి, ఉప్మా, పెరుగన్నం, బిసిబేళా బాత్, పాలు, మజ్జిగ అందిస్తోంది.
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే..? #tirumala #tirupati #tirumalatirupati #ttd #ttdnews #ttdupdates https://t.co/1xQWQemHsP
— TeluguPost (@Telugu_Post) July 3, 2023
వెంకన్నకు భారీ ఆదాయం
తిరుమల వెంకన్నకు హుండీ రూపంలో భారీ ఆదాయం లభించింది. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.27 కోట్ల ఆదాయం లభించింది. నిన్న తిరుమల శ్రీవారిని 82,999 మంది దర్శించుకున్నారు. 38,875 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 03, 2023 08:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

