Indian Railways: రైల్వే తీపి కబురు, ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 24 రైళ్లకు గ్రీన్ సిగ్నల్, రైళ్లు నడిచే సమయంతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు, రైళ్ల పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
Train (Photo Credits: PTI)

NewDelhi, June 5: కరోనావైరస్ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో రైల్వేల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రాజధాని, దురంతో, శతాబ్ది తదితర సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు చాలా ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాటు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ (Indian Railways) మళ్లీ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 24 రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు (Indian Railways to resume 24 passenger trains) పేర్కొంది. రైళ్లు నడిచే సమయం, స్టాప్స్‌, మార్గాలతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. వీటితో పాటు పలు సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్లను సైతం నడపాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ప్రజల సౌలభ్యం దృష్ట్యా గోరఖ్‌పూర్‌-పన్వెల్‌, ఢిల్లీ – గోరఖ్‌పూర్‌, ఛప్రా – పన్వెల్‌ మధ్య స్పెషల్‌ సమ్మర్‌ ట్రైన్లను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఐదు స్థాయిల్లో అన్‌లాక్ ప్రక్రియ‌, ప్రతి గురువారం క‌రోనా ప‌రిస్థితుల‌ను ప్రజారోగ్య శాఖ స‌మీక్ష, అన్‌లాక్ మొద‌టి స్థాయిలో కనీస పరిమితులు, ఐద‌వ స్థాయిలో అధిక‌ పరిమితులు

ఈ రైళ్లను పునరుద్ధరించినప్పటికీ, COVID-19 మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తామని, ప్రయాణీకులు వాటికి కట్టుబడి ఉండాలనేది తప్పనిసరి చేస్తారని రైల్వేలకు సమాచారం అందింది. ఇవే కాకుండా కొన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లను కూడా నడపాలని రైల్వే నిర్ణయించింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం ట్విట్టర్‌లో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజల సౌలభ్యం దృష్ట్యా గోరఖ్‌పూర్-పన్వెల్, ఢిల్లీ-గోరఖ్‌పూర్, ఛప్రా-పన్వెల్ మధ్య వేసవి ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపారుు.

ఢిల్లీలో జూన్‌ 14 వరకు సడలింపులతో లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం, మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరవాలని సూచించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

గోరఖ్‌పూర్-పన్వెల్ ప్రత్యేక రైలు జూన్ 6 నుండి వారానికి రెండు రోజులు నడుస్తుంది. ఈ రైలు భోపాల్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్, లక్నో, గోండా మరియు బస్తీ గుండా వెళుతుంది. మరోవైపు, గోరఖ్పూర్-ఆనంద్ విహార్ ప్రత్యేక రైలు జూన్ 7 నుండి వారానికి రెండు రోజులు నడుస్తుంది మరియు ఘజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, సీతాపూర్, గోండా మరియు బస్తీ వంటి నగరాల గుండా నడుస్తుంది. ఛప్రా-పన్వెల్ జూన్ 12 నుండి వారానికి ఒకసారి నడుస్తుంది, ఇది భూసవల్, జబల్పూర్, ప్రయాగ్రాజ్, వారణాసి, ఘాజిపూర్ మరియు బల్లియా వంటి స్టేషన్ల గుండా వెళుతుంది.

జూన్ 5 నుంచి నడవనున్న రైళ్లు ఇవే..

1. Darbhanga-Harnagar-Darbhanga DEMU Passenger Special Train (05591/05592)

2. Darbhanga-Jhanjharpur DEMU Passenger Special Train (05579)

3. Saharsa-Badhra Kothi-Saharsa DEMU Passenger Special Train (05230/05229)

4. Badhra Kothi-Bamankhi-Badhara Kothi DEMU Passenger Special Train (05238/05237)

5. Fatuha-Rajgir- Fatuha MEMU Passenger Special Train (03224/03223)

6. Pt. Deen Dayal Upadhyay-Dildarnagar-Pt. Deen Dayal Upadhyay Passenger Special (03641/03642)

7. Dildarnagar-Tarighat-Dildarnagar Passenger Special Train (03647/03648)

8. Gaya-Kiul-Gaya MEMU Passenger Special (03356/03355)

9. Vaishali-Sonpur-Vaishali DEMU Passenger Special Train (05519/05520)

10. Sonpur-Katihar MEMU Passenger Special Train (03368)

11. Samastipur-Katihar MEMU Passenger Special Train (03316)

12. Sonpur-Chapra-Sonpur MEMU Passenger Special Train (05247/05248)

జూన్ 6 నుంచి నడవనున్న రైళ్ల వివరాలు

1. Jhanjharpur-Darbhanga DEMU Passenger Special Train (05580)

2. Katihar-Sonpur MEMU Passenger Special Train (03367)

3. Katihar-Samastipur MEMU Passenger Special Train (03315)