IRCTC: రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.10 లక్షల జీవిత బీమా, సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్తను అందించింది. ఇకపై రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్తను అందించింది. ఇకపై రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది. ఐఆర్సీటీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారందరికీ ఈ బీమా సౌకర్యం కలుగుతుంది.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నేడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం
రైలు ప్రమాదాల్లో జరిగే మరణం, అంగవైకల్యం, వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ప్రయాణికుడి నుంచి 35 పైసలు మాత్రమే ప్రీమియంగా వసూలు చేస్తారు. తమకు బీమా సౌకర్యం వద్దనుకునేవారు బుకింగ్ సమయంలో ఆ మేరకు ఆప్షన్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
(The above story first appeared on LatestLY on Jul 19, 2023 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

