Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Supreme Court (Credits: X)

Newdelhi, Jan 11: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (Supreme Court) సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు (Guided Tours) మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ భవనంలోని ప్రతి విభాగం గురించి, దాని చారిత్రక విశిష్టత గురించి అధికారులు తెలియజేస్తారన్నారు. అయితే, నిర్దిష్ట  సమయాలు, రోజుల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.

గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)

ఎప్పుడు అనుమతిస్తారు?

ప్రతి నెలా ఒకటో, మూడో శనివారాల్లో ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించవచ్చు. అయితే, ఆ రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉంటే ఈ అవకాశం ఉండదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకెళ్లి, చూపిస్తారు. అయితే, సుప్రీం వీక్షణకు ముందుగా ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకోవడం తప్పనిసరి.

పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)

(The above story first appeared on LatestLY on Jan 11, 2025 10:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).