Rain Alert: అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి.
Hyderabad, Sep 24: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలు (Rains) కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఈ రోజు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నట్టు వెల్లడించారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.
(The above story first appeared on LatestLY on Sep 24, 2024 08:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

