Landslide in Nepal: నేపాల్ బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు భార‌తీయులు మృతి, భారీ వరదలతో సహాయక చర్యలకు ఆటంకం, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

నేపాల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగతి విదితమే నారాయ‌ణ‌ఘాట్‌-ముగ్‌లింగ్ జాతీయ ర‌హ‌దారిపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో రెండు బ‌స్సులు ప‌క్క‌నే ఉన్న Trishuli న‌దిలో ప‌డ్డాయి. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న దాదాపు 65 మంది ప్ర‌యాణికులు గ‌ల్లంత‌య్యారు.

Landslide in Nepal: నేపాల్ బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు భార‌తీయులు మృతి, భారీ వరదలతో సహాయక చర్యలకు ఆటంకం, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
Landslide in Nepal (photo-X)

Kathmandu, July 12: నేపాల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగతి విదితమే నారాయ‌ణ‌ఘాట్‌-ముగ్‌లింగ్ జాతీయ ర‌హ‌దారిపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో రెండు బ‌స్సులు ప‌క్క‌నే ఉన్న Trishuli న‌దిలో ప‌డ్డాయి. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న దాదాపు 65 మంది ప్ర‌యాణికులు గ‌ల్లంత‌య్యారు. వారిలో ఏడుగురు భార‌తీయులు ఉండ‌గా.. తాజాగా ఆ ఏడుగురు భార‌తీయులు మ‌ర‌ణించిన‌ట్లు తేలింది. అయితే మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఏంజెల్‌ బస్సు, గణపతి డీలక్స్‌ బస్సులు దేశ రాజధాని ఖాట్మండుకి వెళ్తున్నాయి. అయితే నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 3 గంటలకు సెంట్రల్ నేపాల్‌లోని నారాయణఘాట్‌-ముగ్‌లింగ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అదుపుతప్పిన రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. నదీ ప్రవాహ తీవ్రతతో అవి రెండు కొట్టుకుపోయాయని ప్రభుత్వ ప్రతినిధి ఖిమా నంద భుసాల్‌ చెప్పారు.24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.  నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)

సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ బస్సు బుట్వాల్‌ నుంచి కాఠ్‌మాండూకు వెళుతోంది. మృతుడిని మేఘ్‌నాథ్‌గా గుర్తించారు.

ఈ ఘటనలపై నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంట‌నే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని తెలిపారు. కాగా, నేపాల్‌లో వర్షాకాలం జూన్‌లో మొదలై సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఈ సమయంలో హిమాలయదేశంలో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో విరివిగా కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి.

Here's Nepali ArmyTweet

Nepal Bus Accident Videos

ఒక ప్రత్యేక సంఘటనలో, కస్కీ జిల్లాలో గురువారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు మరియు వరదలలో కనీసం 11 మంది మరణించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి గత నాలుగు వారాలుగా నేపాల్ అంతటా వర్షాలకు సంబంధించిన సంఘటనలలో కనీసం 74 మంది మరణించారు మరియు 80 మంది గాయపడినట్లు నేపాల్ పోలీసు ప్రధాన కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

భారీ వర్షాల కారణంగా నేపాల్ అంతటా జనజీవనం ప్రభావితమైంది మరియు 5,000 మంది పోలీసు సిబ్బందిని రెస్క్యూ మరియు రిలీఫ్ పనులలో సమీకరించారు. రుతుపవన సంబంధిత విపత్తుల వల్ల జరిగిన నష్టం రూ. 95 మిలియన్ల కంటే ఎక్కువ. వర్షాకాల విపత్తుల కారణంగా దశాబ్ద కాలంలో 1,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. రాజధాని నగరం ఖాట్మండులో తీవ్రమైన వరదలు వీధులను ముంచెత్తాయి, ఇళ్లు మరియు వాహనాలు నీటి అడుగున నిలిచిపోయాయి మరియు నివాసితులు తమ రోజువారీ పనుల కోసం బ్రౌన్ వరదనీటి గుండా వెళ్లవలసి వచ్చింది.

(The above story first appeared on LatestLY on Jul 12, 2024 01:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).