Fuel Price Spike: సామాన్యులపై మరోసారి పెట్రోబాంబు, పదిరోజుల్లో తొమ్మిదోసారి ధరల పెంపు, ప్రతీరోజు సగటున 80 పైసలకు పైగా పెంపు, బెంబేలెత్తుతున్న సామాన్యులు
సామాన్యులకు కేంద్రం పెట్రోవాత కొనసాగుతోంది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (fuel price spike) పెంచుతూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.గత పదిరోజుల్లో తొమ్మిదిసార్లు ధరలను పెంచిన సంస్థలు తాజాగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) పై 80 పైసలు చొప్పున పెంచాయి. ఈ పెంపుతో హైదరాబాద్ (Hyderabad) లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40 కు చేరగా.. డీజిల్ ధర 101.56 కు చేరింది.
Hyderabad, March 31: సామాన్యులకు కేంద్రం పెట్రోవాత కొనసాగుతోంది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (fuel price spike) పెంచుతూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.గత పదిరోజుల్లో తొమ్మిదిసార్లు ధరలను పెంచిన సంస్థలు తాజాగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) పై 80 పైసలు చొప్పున పెంచాయి. ఈ పెంపుతో హైదరాబాద్ (Hyderabad) లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40 కు చేరగా.. డీజిల్ ధర 101.56 కు చేరింది. ఇక తొలి నుండి రేటు అధికంగా ఉన్న ఏపీలో విజయవాడ (Vijayawada)లో లీటర్ పెట్రోల్ ధర రూ.117, డీజిల్ ధర రూ.103 దాటింది. గత శనివారం చమురు కంపెనీలు పెట్రోల్పై 89 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెంచడంతో మొదలైన ఈ బాదుడు ప్రతిసారి 80 పైసలు పైన పెంచుతూ వస్తున్నాయి. చమురు కంపెనీల పెంపుకు మళ్ళీ రాష్ట్రాల పన్నులు కలుపుకుంటే ఇది 90 పైసల పైనే ఉంటుంది.
Price of petrol & diesel in Delhi at Rs 101.81 per litre & Rs 93.07 per litre respectively today (increased by 80 paise)
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 116.72 & Rs 100.94 (increased by 84 paise) pic.twitter.com/ghPLS6quSj
— ANI (@ANI) March 31, 2022
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే కేంద్రం చమురు ధరలను పెంచలేదని విపక్షాలు ఆరోపించాయి. ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే ధరలను పెంచడం మొదలుపెట్టాయి చమురు సంస్థలు. గడిచిన పదిరోజుల్లో ఒక రోజు మినహా ప్రతీ రోజూ ధరలను పెంచుతూ వెళ్లాయి.
అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. ఎన్నికల అనంతరం గత వారం నుంచి బాదుడు మొదలవగా.. నిపుణుల అంచనా ప్రకారం ధరలు రూ.120-125 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
(The above story first appeared on LatestLY on Mar 31, 2022 09:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

