AGR Case: 'అసలు దేశంలో న్యాయం అంటూ ఉందా? లేదా దేశం విడిచి మేమే వెళ్లిపోవాలా? నాన్సెన్స్' టెలికాం సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్ట్

ఉపయోగించకూడని కఠిన పదాలను మీరు మమ్మల్ని ఉపయోగించేలా చేయాలనుకుంటున్నారా? ఎవరు ఈ నాన్సెన్స్ క్రియేట్ చేసింది, ఆ ఆర్డర్ ఎలా పాస్ చేస్తారు? అసలు దేశంలో న్యాయం అనేది ఉందా? నేను ఈకోర్టును, దేశాన్ని విడిచి వెళ్తే బాగుంటుందేమో" అంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

AGR Case: 'అసలు దేశంలో న్యాయం అంటూ ఉందా? లేదా దేశం విడిచి మేమే వెళ్లిపోవాలా? నాన్సెన్స్' టెలికాం సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్ట్
Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, February 14:  టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి ఏజీఆర్ ఛార్జీల (AGR Charges) కింద బకాయిపడ్డ వేలకోట్ల రూపాయలను ఇంకా చెల్లింకపోవడంపై సుప్రీంకోర్ట్ (Supreme Court) శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ ఆదేశాలను ఎందుకు పాటించలేదని టెలికాం ఆపరేటర్లను సుప్రీం నిలదీసింది. పే అప్ ఆర్డర్ పాటించకపోవడం పట్ల ఆ సంస్థల ఎండీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఇటు ప్రభుత్వం అలసత్వంపై కూడా సుప్రీం మండిపడింది.

ఏజీఆర్ కేసుపై ఈరోజు విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోడానికి ప్రభుత్వం కూడా ఎందుకో శ్రద్ధ చూపడం లేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

టెలికాం ఆపరేటర్ల పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తూ కోర్ట్ ఉత్తర్వులనే ప్రభావితం చేసేలా ఆర్డర్ జారీ చేసిన ప్రభుత్వంలోని ఆ టెలికాం డెస్క్ ఆఫీసర్ ఎవరో వెంటనే ఉపహంరించుకోవాలి. లేకపోతే జైలుకు పంపాల్సి ఉంటుంది అని సుప్రీం తీవ్రంగా మందలించింది.

"ఉపయోగించకూడని కఠిన పదాలను మీరు మమ్మల్ని ఉపయోగించేలా చేయాలనుకుంటున్నారా? ఎవరు ఈ నాన్సెన్స్ క్రియేట్ చేసింది, ఆ ఆర్డర్ ఎలా పాస్ చేస్తారు? అసలు దేశంలో న్యాయం అనేది ఉందా? నేను ఈకోర్టును, దేశాన్ని విడిచి వెళ్తే బాగుంటుందేమో" అంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

భారతీ ఎయిర్టెల్, టాటా టెలిసర్వీసెస్ మరియు వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ మిశ్రా ఇలా స్పందించారు.

ANI Update:

సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) విషయంలో తన మునుపటి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను జనవరి 16న సుప్రీంకోర్టు కొట్టివేసింది, టెలికాం ఆపరేటర్ల పిటిషన్ లో ఎలాంటి బలమైన కారణం లేదని స్పష్టం చేసింది.

మార్చి 17న అన్ని టెల్కోస్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) ను కోర్టు పిలిపించి, బకాయిలు ఎందుకు చెల్లించలేదని, వారిపై ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోకూడదని వివరించాలని కోరారు.

నివేదికల ప్రకారం, స్పెక్ట్రం వినియోగ ఛార్జ్, లైసెన్స్ ఫీజు, ఆసక్తులు మరియు జరిమానాతో సహా పదిహేను టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ .1.47 లక్షల కోట్లకు పైగా బకాయిలు పడ్డాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పు తరువాత, వోడాఫోన్-ఐడియా షేర్లు 13 శాతానికి పైగా పడిపోయాయి. సొలిసిటర్ జనరల్ అభ్యర్థించినప్పటికీ విచారణను వాయిదా వేయడానికి కోర్టు నిరాకరించడంతో ఇతర టెలికాం షేర్లు కూడా పడిపోయాయి.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, భారతి ఎయిర్‌టెల్ లైసెన్స్ ఫీజు రూ .21,682.13 కోట్లు, వోడాఫోన్ నుంచి రావాల్సిన బకాయిలు రూ .19,823.71 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ .16,456.47 కోట్లు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఎమ్‌టిఎన్‌ఎల్‌ నుంచి రూ .2,537.48 కోట్లు, బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ .2,098.72 కోట్లు రావాల్సి ఉంది.

సుప్రీం సీరియస్ అవ్వడంతో, కేంద్రంలో కదలిక వచ్చింది. టెలికాం ఆపరేటర్లు తమ బకాయిలన్నింటినీ శుక్రవారం అర్ధరాత్రి లోపే అంటే రాత్రి 11:59 లోపు చెల్లించాలంటూ హుకూం జారీ చేసింది.

(The above story first appeared on LatestLY on Feb 14, 2020 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).