
Guwahati December 15: కిలో టీ పౌడర్(Tea Powder) ఎంతుంటుంది.? మహా అయితే వెయ్యి రూపాయలు…కానీ అస్సాం(Assam Tea)లో వేలం వేసిన ఓ టీ పొడి ఏకంగా లక్ష పలికింది. అవును మీరు విన్నది నిజమే! టేస్ట్ లో అదరహో అనిపించే మనోహరి గోల్డ్ టీ(Manohari Gold Tea) ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది.
పొద్దున్నే టీ లేనిదే కొందరికి రోజు గడవదు. అలా ప్రతి ఒక్కరి జీవితాలతో పెనవేసుకున్న టీ(Tea) కోసం ఎంతైనా ఖర్చు చేసేవాళ్లుంటారు. అయితే అస్సాంలో జరిగిన టీ పొడి వేలంలో ఒక అరుదైన టీ పౌడర్ లక్ష పలికింది(Manohari Gold Tea sets record sells for whopping Rs. 99,999 per kg). భారత్లో దొరికే టీ పొడుల్లో అస్సాం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తయ్యే చాయ్ పొడికి మంచి డిమాండ్ ఉంటుంది.
Manohari Gold Tea, a rare variety of tea in Assam sold for Rs 1 lakh per kilogram on Tuesday at Guwahati Tea Auction Centre: Bidyananda Barkakoty, Adviser, North Eastern Tea Association (NETA) pic.twitter.com/XZ6SuddVd0
— ANI (@ANI) December 14, 2021
ప్రతీ ఏటా అసాంలో పలు అరుదైన రకాలకు చెందిన టీ పొడులను పలు సంస్థలు వేలం వేస్తాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు మనోహరి గోల్డ్ టీ(Manohari Gold Tea) అనే చాయపత్తాను వేలం వేశారు. ఈ టీ పొడి రికార్డు ధర నమోదు పలికింది. వేలంలో కిలో టీ పొడి 99వేల 999కు అమ్ముడుపోయింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర.
మనోహరి గోల్డ్ టీ పొడి(Manohari Gold Tea)ని మనోహరి టీ ఎస్టేట్స్ ఉత్పత్తి చేసుంది. ఈ కంపెనీ నుంచి సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ లక్ష రూపాయలకు ఈ టీ పౌడర్ను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టీ పొడి కొనుగోలు, విక్రయాల్లో దేశంలోనే ఇది అత్యధిక ధర. పసుపు రంగులో ఉండి అద్భుతమైన రుచిని అందించే మనోహరి గోల్డ్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేరుంది. 2019 జులైలో ఈ టీ పొడిని వేలం నిర్వహించగా ఈ పొడి కేజీ 50వేలకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పింది. అయితే కొద్దిరోజులకే ఈ రికార్డు బద్దలైంది. గోల్డెన్ నెడ్డిల్స్ టీ తోపాటు గోల్డెన్ బటర్ఫ్లై టీ లు 75 వేలకు అమ్ముడుపోయాయి. ఈ రికార్డును ప్రస్తుతం మనోహరి గోల్డ్ టీ తిరగరాసింది.