Karnataka shocker: కోర్టులో ఉన్మాదిలా మారిన భర్త, అందరూ చూస్తుండగానే భార్య గొంతు కోసి దారుణ హత్య, కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి..
Stabbed (file image)

Bengaluru, August 15: కర్ణాటకలో దారుణ ఘటన (Karnataka shocker) చోటు చేసుకుంది. ఉన్మాదిలా మారిన ఓ భర్త కోర్టు ఆవరణలోనే తన భార్య గొంతును కత్తితో (Husband slits wife's throat ) కోశాడు. అంతకు పది నిమిషాల ముందే కోర్టులో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఇద్దరమూ కలిసి బతుకుతామని నిర్ణయానికి కూడా వచ్చారు. కానీ అంతలోనే పారిపోయేందుకు ప్రయత్నించాడు.అయితే చుట్టుపక్కల వాళ్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన కర్ణాటకలోని హస్సన్‌ జిల్లాలోని హోలెనారసిపుర ఫ్యామిలీ కోర్టు వద్ద జరిగింది. శివకుమార్‌, చైత్రలకు ఏడేండ్ల కింద పెండ్లి జరిగింది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బయటకు రాగానే తన కత్తితో శివకుమార్‌.. చైత్ర గొంతు కోశాడు. ఆమె చనిపోయింది.

ముగిసిన దళిత విద్యార్థి అంత్యక్రియలు, పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్తులు, టీచర్ కుండలొ నీళ్లు తాగాడని బాలుడిని కొట్టి చంపిన టీచర్

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చైత్ర, శివకుమార్‌లకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, ఈ జంట సహృదయ జీవితాన్ని గడపలేక కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. శనివారం, రాజీ కోసం జంటను కోర్టుకు పిలిచారు. న్యాయమూర్తి, న్యాయవాది సలహా మేరకు తన ఇద్దరు పిల్లల కోసం భార్యతో విభేదాలను పూడ్చుకుంటానని శివకుమార్ కోర్టుకు హామీ ఇచ్చారు.రాజీకి అంగీకరించిన శివకుమార్ తన భార్యను రెస్ట్‌రూమ్‌కు తీసుకెళ్లి గొంతు (Husband slits wife's throat at court )కోశాడని ఆరోపించారు. అనంతరం చైత్రతో ఉన్న చిన్నారిపై కూడా దాడి చేశాడు. అయితే, అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు అతడిని అడ్డుకోవడంతో పాపను రక్షించారు.

తరువాత, శివకుమార్ నేరం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, అయితే వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చైత్రను వెంటనే హోలెనరసిపుర ఆసుపత్రికి తరలించి, ఆపై హాసన్ జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె మరణించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు IANS నివేదించింది