Saurabh Kumar Shot Dead in Bihar: పార్లమెంట్ ఎన్నికల వేళ బీహార్ లో హత్యా రాజకీయాలు, నితీష్ కుమార్ పార్టీ నేతను నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు (వీడియో ఇదుగోండి)
జేడీయూ పార్టీకి చెందిన సౌరభ్ కుమార్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాట్నా (Patna)లో ఓ వివాహాది కార్యక్రమానికి వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు బైక్పై వచ్చి సౌరభ్పై కాల్పులు జరిపారు.
Patna, April2 25: బీహార్ (Bihar) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి చెందిన యువ నేత (JDU Leader) దారుణ హత్యకు గురయ్యాడు (shot dead). బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. జేడీయూ పార్టీకి చెందిన సౌరభ్ కుమార్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాట్నా (Patna)లో ఓ వివాహాది కార్యక్రమానికి వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు బైక్పై వచ్చి సౌరభ్పై కాల్పులు జరిపారు.
VIDEO | Bihar: JD(U) leader Saurabh Kumar was shot dead in Punpun near #Patna late last night. Saurabh Kumar was returning from a wedding when unidentified men shot him. More details are awaited.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/VurPSj468O
— Press Trust of India (@PTI_News) April 25, 2024
ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
#WATCH | Patna, Bihar: On JDU leader Saurabh Kumar shot dead, SDPO Masaurhi Kanhaiya Singh says, "...Saurabh Kumar came with his friends to attend a reception function. While returning he was shot by unknown miscreants, then he was taken to hospital and one other person named… pic.twitter.com/DhWHCYlJay
— ANI (@ANI) April 25, 2024
ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
(The above story first appeared on LatestLY on Apr 25, 2024 11:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

