Tamil Nadu Bus Accident Video: ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి, మరో 40 మందికి పైగా గాయాలు, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం స్టాలిన్
తమిళనాడులో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Read in
- తెలుగు
తమిళనాడులో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులు నజ్జునుజ్జుయినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
#WATCH | Tamil Nadu | Around 70 people injured in a collision between two private buses in Melpattampakkam of Cuddalore district. The injured have been taken to Cuddalore government hospital. Further details awaited. pic.twitter.com/TX9H5pA1AF
— ANI (@ANI) June 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 19, 2023 03:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

