Jammu and Kashmir Terror Attack: జ‌మ్మూక‌శ్మీర్ లో యాత్రికుల బ‌స్సుపై ఉగ్ర‌దాడి, విచ‌క్షణా ర‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 10 మందికి పైగా మృతి

జమ్మూ-కశ్మీర్ లో (Jammu Kashmir) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రియాసి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్ర‌వాదుల కాల్పుల‌తో అదుపు త‌ప్పిన బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింది.

Jammu and Kashmir Terror Attack: జ‌మ్మూక‌శ్మీర్ లో యాత్రికుల బ‌స్సుపై ఉగ్ర‌దాడి, విచ‌క్షణా ర‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 10 మందికి పైగా మృతి
Jammu and Kashmir Terror Attack

Srinagar, June 09: జమ్మూ-కశ్మీర్ లో (Jammu Kashmir) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రియాసి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్ర‌వాదుల కాల్పుల‌తో అదుపు త‌ప్పిన బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింది. దీంతో ప్రాణ‌న‌ష్టం మ‌రింత పెరిగే అవ‌కాశముంది.

 

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, భద్రత బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

 

ఒక‌వైపు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా మూడోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో దాడి జ‌ర‌గ‌డం, సామాన్య‌ప్ర‌యాణికుల‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

(The above story first appeared on LatestLY on Jun 09, 2024 09:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).