Essential Commodities Act: రైతుల భరోసా కోసం ఎసెన్సియ‌ల్ క‌మోడిటీస్ యాక్ట్‌, 50 ఏళ్ల రైతుల డిమాండ్‌ నెరవేరిందని తెలిపిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
Union Minister Prakash Javadekar Says AP and J&K are Not Comparable | (Photo Credits: ANI)

New Delhi, June 3: వన్ నేషన్ వన్ మార్కెట్ (One Nation, One Market) ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తూ రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ (Union Minister Prakash Javadekar) తెలిపారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య

నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయని జవదేకర్ చెప్పారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీతో ఏర్పడుతున్న ఇబ్బందులు రైతులకు ఇక ఉండబోవు. దీంతో పాటుగా కోల్‌క‌తా పోర్ట్ ట్ర‌స్ట్ పేరును శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ ట్ర‌స్ట్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణ‌యానికి కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని జ‌వ‌దేక‌ర్ తెలిపారు.

కేంద్ర క్యాబినెట్ బుధ‌వారం తీసుకున్న నిర్ణ‌యాలు గ్రామీణ భారతానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ప‌డుతూ వ‌స్తున్న వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌కు తాము శ్రీకారం చుట్టామ‌ని, దీంతో వ్య‌వ‌సాయ రంగంలో గ‌ణనీయ‌మైన మార్పులు చోటుచేసుకుంటాయ‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు. అత్య‌వ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టంలో తీసుకొచ్చిన స‌వ‌ర‌ణ‌లు రైతుల ఆదాయాన్ని పెంచుతాయ‌ని ప్ర‌ధాని ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.

Here's PM Tweet

బుధ‌వారం ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ కేంద్ర క్యాబినెట్ భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన జ‌వ‌దేక‌ర్.. ఆ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. అత్య‌వ‌స‌ర వ‌స్తువుల స‌వ‌ర‌ణ చ‌ట్టానికి (ఎసెన్సియ‌ల్ క‌మోడిటీస్ యాక్ట్‌కు) క్యాబినెట్ ఆమోదం తెలిపింద‌ని చెప్పారు. రైతుల కోసం కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గతంలో ఈ చట్టాన్ని ఆహార కొరతను ఎదుర్కొన్న సమయంలో అమలు చేశారని.. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ చట్టం ద్వారా 50 ఏళ్ల రైతుల డిమాండ్‌ నెరవేరిందని జవదేకర్‌ అన్నారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్స్‌(పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కరోనా యాప్‌ను ప్రారంభించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 10 మందికి కరోనా వైరస్

దీంతో పాటుగా పరిమిత సంఖ్యలో విదేశీ వ్యాపారుల ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్" title="Essential Commodities Act: రైతుల భరోసా కోసం ఎసెన్సియ‌ల్ క‌మోడిటీస్ యాక్ట్‌, 50 ఏళ్ల రైతుల డిమాండ్‌ నెరవేరిందని తెలిపిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్">

Union Minister Prakash Javadekar Says AP and J&K are Not Comparable | (Photo Credits: ANI)