Omicron Scare: కరోనా థర్డ్ వేవ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎంఏ, ఒమిక్రాన్ భారత్కు పెద్ద ఎదురుదెబ్బ, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ స్థాయిలో కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ (Omicron Scare) కలకలం రేపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) (Indian Medical Association) హెచ్చరించింది.
New Delhi, Dec 7: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ (Omicron Scare) కలకలం రేపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) (Indian Medical Association) హెచ్చరించింది. సార్స్-కోవి-2 వైరస్ యొక్క కొత్త వేరియంట్ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 మందికి సోకింది.
కాగా కరోనా సెకండ్ వేవ్ కష్టాలను ఎలాగోలా అధిగమించి, మళ్లీ సాధారణ జీవనం వైపు సాగుతున్న భారత్కు ‘ఒమిక్రాన్’ ఒక పెద్ద ఎదురుదెబ్బ అని ఐఎంఏ అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వేరియంట్ను నియంత్రించవచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్ విషయంలో చిత్తశుద్ధితో ఫోకస్ పెట్టి పనిచేస్తే కరోనా థర్డ్వేవ్ను అడ్డుకోగలుగుతామని, ఒమిక్రాన్ ప్రభావం ( third wave of Covid amid Omicron threat) నుంచి తప్పించుకోగలుగుతామని పేర్కొంది.
అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు మరియు మూలం ఉన్న దేశాలలో గుర్తించబడిన అనుభవంతో, Omicron వేరియంట్ అధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఇది ఎక్కువ మంది వ్యక్తులను ప్రభావితం చేస్తుందని IMA సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొంది.12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు టీకాలు వేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వేగవంతం చేయాలని వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఈ తరుణంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్లైన్ కార్మికులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు అదనపు మోతాదు (వ్యాక్సిన్) ఇవ్వబడుతుందని అధికారికంగా ప్రకటించాలని IMA ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని IMA అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ప్రతిరోజూ దాదాపు కోటి మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో అర్హులైన వారిలో 85 శాతం మందికి సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు.మరో రోజు, మరో మైలురాయిని చేరుకున్నాం.
నేటితో దేశంలో వ్యాక్సినేషన్కు అర్హులైన 85 శాతం మందికి సింగిల్ డోస్ టీకాలు వేయడం పూర్తయ్యింది. ప్రధాని మోదీ సబ్కా ప్రయాస్ అనే మంత్రంవల్లనే కరోనా వ్యతిరేక పోరాటంలో దేశంలో బలంగా దూసుకుపోతున్నది’ అని మన్సుక్ మాండవీయ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. సోమవారం నాటికి 128.66 కోట్ల వ్యాక్సిన్ కవరేజీ పూర్తయ్యింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 71 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
(The above story first appeared on LatestLY on Dec 07, 2021 06:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

