COVID-19 in India: ఇండియాలో 78 మంది రికవరీ, 873కి చేరిన కరోనా కేసులు, ఇప్పటివరకు 19 మంది కరోనా కాటుకు బలి, లోకల్ టెస్టింగ్ కిట్స్ అభివృద్ధి చేస్తున్న ఐసీఎంఆర్

దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus Outbreak in India) మహమ్మారి మెల్లిగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 873కు చేరింది. అదే విధంగా కోవిడ్‌-19 మరణాల సంఖ్య ( COVID-19 Deaths in India) 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం వెల్లడించింది.

COVID-19 in India: ఇండియాలో 78 మంది రికవరీ, 873కి చేరిన కరోనా కేసులు, ఇప్పటివరకు 19 మంది కరోనా కాటుకు బలి, లోకల్ టెస్టింగ్ కిట్స్ అభివృద్ధి చేస్తున్న ఐసీఎంఆర్
Coronavirus (Photo Credits: IANS)

New Delhi, March 28: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus Outbreak in India) మహమ్మారి మెల్లిగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 873కు చేరింది. అదే విధంగా కోవిడ్‌-19 మరణాల సంఖ్య ( COVID-19 Deaths in India) 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం వెల్లడించింది.

అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు

కాగా ప్రాణాంతక కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అదే విధంగా కష్టకాలంలో అత్యవసరంగా మారిన మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి.

కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) స్థానిక పరీక్షా వస్తు సామగ్రిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఐసిఎంఆర్ వద్ద ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనికేషన్ వ్యాధి విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఆర్ గంగాఖేద్కర్ ప్రకారం, పూణే యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు పరీక్షా వస్తు సామగ్రిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. "టీకాపై పనిచేస్తున్న వివిధ పరిశోధనా బృందాల ప్రయత్నాలను కూడా మేము గమనిస్తున్నాము. ఐదుగురు శాస్త్రవేత్తలు ఇప్పటికే జంతువులపై పరీక్షా దశలో ఉన్నారు. త్వరలోనే దీనిని మనుషులపై ప్రయోగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్

ఔషధ రెగ్యులేటర్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) స్థానిక COVID-19 పరీక్షా వస్తు సామగ్రి, వ్యాక్సిన్లు మరియు చికిత్సా విధానాల అభివృద్ధికి వీలుగా చర్యలు ప్రారంభించింది. కరోనావైరస్-సంబంధిత వ్యాక్సిన్లు, డయాగ్నొస్టిక్, రోగనిరోధక మరియు చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడంలో పనిచేసే సంస్థలకు ఇది వేగంగా ట్రాక్ చేయబడిన రెగ్యులేటరీ ఆమోదాలను కూడా కలిగి ఉంది.

ఇదిలా ఉంటే ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి పూణెలోని శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఫొటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి.

భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఇది అచ్చం ‘మెర్స్-కోవ్’ వైరస్‌ను పోలి ఉంది. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం.

(The above story first appeared on LatestLY on Mar 28, 2020 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).