Cattle Death In Karnataka: 20 గోమాతలను అరటిపండులో విషం పెట్టి చంపేశారు, కర్ణాటలో అమానుష ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దేశంలో మూగజీవాలపై అరాచక వ్యక్తుల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పండ్లలో పేలుడు పదార్ధాలు పెట్టి తినిపించి దాని చావుకు కారణమైన ఘటన మర్చిపోకముందే మరో దారుణమైన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కాఫీ తోటలోకి చొరబడుతున్నాయనే కారణంతో అరటిపండ్లలో విషం పెట్టి కొందరు దుర్మార్గులు ఏకంగా 20 పశువుల ప్రాణాలు (Cattle Death In Karnataka) తీశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఐగూరు ఎస్టేట్లో చోటుచేసుకుంది. కాఫీ తోట మేనేజరు, ఇతర సిబ్బంది ఈ దారుణానికి ఒడిగట్టారు.
Bengaluru, July 20: దేశంలో మూగజీవాలపై అరాచక వ్యక్తుల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పండ్లలో పేలుడు పదార్ధాలు పెట్టి తినిపించి దాని చావుకు కారణమైన ఘటన మర్చిపోకముందే మరో దారుణమైన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కాఫీ తోటలోకి చొరబడుతున్నాయనే కారణంతో అరటిపండ్లలో విషం పెట్టి కొందరు దుర్మార్గులు ఏకంగా 20 పశువుల ప్రాణాలు (Cattle Death In Karnataka) తీశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఐగూరు ఎస్టేట్లో చోటుచేసుకుంది. కాఫీ తోట మేనేజరు, ఇతర సిబ్బంది ఈ దారుణానికి ఒడిగట్టారు. ఎంత దారుణమైన చర్య, కోతిని ఉరితీస్తూ సంబరాలు జరుపుకున్న కొందరు గ్రామస్థులు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అమానవీయ సంఘటన
వివరాల్లోకెళితే.. ఐగూరు ఎస్టేట్ సమీప గ్రామంలోని ఆవులు తరుచూ మేత కోసం వెళ్లేవి. దీంతో ఎస్టేట్లో ఉన్న కాఫీ తోటలు పాడైపోతుండటంతో నిర్వాహకులు విసిగిపోయారు. తోటలోకి వచ్చిన ఆవులకు అరటి పండ్లలో విషం (Cows Eat Poison Banana in Karnataka) పెట్టి తినిపించే వారు. అవి చనిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా ఓ గోతిలో పడేస్తూ వచ్చారు. ఇటీవల కూడా కొన్ని ఆవులు (Cows) కనిపించకపోవడంతో గ్రామస్ధులు చుట్టు పక్కల గాలించారు. ఎస్టేట్ సమీపంలోని గోతిలో 7 ఆవులు కనిపించాయి. నిర్వాహకులను వారంతా నిలదీయగా తామే చంపామని అంగీకరించారు. ఇప్పటి వరకు 20 ఆవులను చంపారని వాటి యజమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏనుగుతో పాటు కడుపులో బిడ్డను చంపేశారు, బాణసంచా కూర్చిన పైనాపిల్ తిని కేరళలో ఏనుగు మృతి, ఎఫ్ఐఆర్ నమోదు
ఇంతుముందు కేరళలో ఏనుగు దారుణ మరణం, అసోంలో కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు 13 కోతుల మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపిన విషయం విదితమే. ఇక చిక్కమగళూరు జిల్లా బాసవరళ్లి గ్రామానికి చెందిన కొట్టె గౌడ, మధు అనే వ్యక్తులకు చెందిన మూడు ఆవులు విషంతో నిండిన పనసపళ్లు తిని మరణించాయి. పొలంలోకి అడవి జంతువులు చొరబడకుండా ఆపడం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 20, 2020 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

