Cyclone Hamoon Update: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన హమూన్, తీరం వైపు వేగంగా దూసుకువస్తున్న సైక్లోన్, ఈ రెండు రాష్ట్రాలకు హై అలర్ట్
Representational Image (Pixabay)

భువనేశ్వర్, అక్టోబర్ 24: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను ఇప్పుడు తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది. IMD నుండి వచ్చిన సమాచారం ప్రకారం, వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా 'హమూన్' తుఫాను గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదిలింది.ఈ తుపానుకు ఇరాన్.. హ‌మూన్ అని నామ‌క‌ర‌ణం చేసింది.

తుఫాను ఆరు గంటల పాటు కదిలిన తర్వాత, తీవ్ర తుఫానుగా మారింది. అక్టోబర్ 24 తెల్లవారుజామున 2:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతం మీదుగా, అక్షాంశం 19.3°N మరియు రేఖాంశం 88.4°E, తూర్పున 210 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమ‌వారం సాయంత్రం 5:30 గంట‌ల‌కు ఒడిశాలోని పారాదీప్‌కు 230 కిలోమీట‌ర్లు, ప‌శ్చిమ బెంగాల్‌లోని ధిగాకు 360 కిలోమీట‌ర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని హెపుప‌రాకు 510 కిలోమీట‌ర్ల దూరంలో తుపాను కేంద్రీకృత‌మైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

ఈ ఉదయం 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాలకు హెచ్చరిక.. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.. రేపు బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం..

తుఫాను తుఫాను దాదాపు ఉత్తర-ఈశాన్య ప్రాంతాలకు కదులుతూ, అక్టోబరు 25 మధ్యాహ్నం సమయంలో ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరాన్ని డీప్ డిప్రెషన్‌గా దాటే అవకాశం ఉంది. అంతకుముందు, సోమవారం, బంగాళాఖాతంలో తుఫాను 'హమూన్' ఏర్పడే దృష్ట్యా ఒడిశాలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని పట్టణ స్థానిక సంస్థలను (ULB) అప్రమత్తం చేసింది.తుపాను ప్ర‌భావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

యెమెన్ వద్ద తీరాన్ని దాటిన తేజ్ తుపాను, రానున్న 6 గంటల్లో బలహీనపడే అవకాశం, ఉత్తర భారతంలొ భారీ వర్షాలు కురిసే అవకాశం

తుపాను ప్ర‌భావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రేపు బంగ్లాదేశ్‌లోని హెపుప‌రా, చిట్ట‌గాంగ్ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. తుపాను నేప‌థ్యంలో ఒడిశా ప్ర‌భుత్వం జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్ర‌భావం ఉండ‌న‌ప్ప‌టికీ, జాల‌ర్లు ఎవ‌రూ బుధ‌వారం వ‌ర‌కు వేట‌కు వెళ్లొద్ద‌ని అధికార యంత్రాంగం సూచించింది. తీర ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.హ‌మూన్ తుపాను కార‌ణంగా భార‌త తీరంపై అంత‌గా ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఐఎండీ పేర్కొంది. తుపాను కారణంగా రాబోయే రెండ్రోజుల్లో ఒడిశాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు.