HYD Horrifying Video: కరోనా శవాన్ని పీక్కుతింటున్న కుక్క, హైదరాబాద్ నగరం నుంచి ఒళ్లు గగుర్పొడిచే వీడియో బయటకు, సనత్ నగర్ శ్మశానవాటికలో అమానవీయ ఘటన
చనిపోయిన వారిని గౌరవించే గొప్ప సంస్కృతి మన దేశానిది. అయితే దీనిని కరోనా (Coronavirus) చెరిపేసింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారిని (Coronavirus dead body cremation) కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. అంత్యక్రియల నిర్వహణలోనూ దగ్గర ఉండలేని దుస్థితి నెలకొంది. వారిని అనాథ శవాల్లా వదిలేస్తున్నారు. తమకూ కరోనా సోకుతుందని స్థానిక ప్రజలు కూడా కరోనా మృతదేహాలను ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు.
Hyderabad, July 8: చనిపోయిన వారిని గౌరవించే గొప్ప సంస్కృతి మన దేశానిది. అయితే దీనిని కరోనా (Coronavirus) చెరిపేసింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారిని (Coronavirus dead body cremation) కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. అంత్యక్రియల నిర్వహణలోనూ దగ్గర ఉండలేని దుస్థితి నెలకొంది. వారిని అనాథ శవాల్లా వదిలేస్తున్నారు. తమకూ కరోనా సోకుతుందని స్థానిక ప్రజలు కూడా కరోనా మృతదేహాలను ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు. తెలంగాణ హైకోర్టులో 10 మందికి కరోనా పాజిటివ్, అప్రమత్తమైన అధికారులు, హైకోర్టు భవనాన్ని మూసివేసి శానిటైజేషన్ చేస్తున్న సిబ్బంది
ఇక సామాజిక మాధ్యమాల్లో కరోనా మృతులను సామూహిక ఖననం చేస్తున్న వీడియోలు కంతటడి పెట్టించాయి.అలాంటి సంఘటనే హైదరాబాద్ సనత్ నగర్ శ్మశానవాటికలో (Hyderabad Horrifying Video) జరిగింది. కరోనాతో చనిపోతే మతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తుండటంతో శరీర భాగాలను కుక్కలు పీక్కుతింటున్న అమానవీయ ఘటన ఇఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో చోటు చేసుకుంది.
Dog Gnawing at Body of COVID-19 Victim in Hyderabad cremator
Outrageous! Dogs eating coronavirus patients dead bodies in graveyard in Hyderabad. You can understand grave situation in the City.#WhereIsKCR pic.twitter.com/8fjW5DB9dL
— Ashish Vivek Merukar (@AMerukar) July 5, 2020
వివరాల్లోకెళితే.. గాంధీ ఆసుపత్రిలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఇఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు . మృతుల వివరాల నమోదు , అంత్యక్రియల పర్యవేక్షణకు జిహెచ్ఎంసి ముగ్గురు సిబ్బందిని అక్కడ నియమించింది . అయితే మృతదేహాలు పూర్తిగా కాలకుండా వదిలేస్తుండటం కలకలం సష్టిస్తోంది.
తన తాత అస్థికల కోసం శ్మశానవాటికకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటంతో అవాక్కయ్యారు . ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్ అయ్యాయి. వీటితో మళ్లీ ఏ కొత్త రోగాలు వస్తాయోనని నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 08, 2020 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

