IED found at Ghazipur market: ఢిల్లీలో బాంబు కలకలం, పండుగ వేళ తప్పిన ముప్పు, పూల మార్కెట్లో 3 కిలోల ఐఈడీ బాంబు గుర్తింపు, నిర్వీర్యం చేసిన భద్రతా సిబ్బంది
గణతంత్ర దినోత్సవం(Republic day) దగ్గర పడుతున్న సమయంలో దేశరాజధాని సమీపంలో బాంబు (Bomb) కలకలం సృష్టించింది. ఘాజీపూర్ పూల మార్కెట్ (Ghajipur flower market)లో ఓ బ్యాగులో అమర్చిన ఐఈడీ(IED)ని గుర్తించారు పోలీసులు. ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు
New Delhi January 14: గణతంత్ర దినోత్సవం(Republic day) దగ్గర పడుతున్న సమయంలో దేశరాజధాని సమీపంలో బాంబు (Bomb) కలకలం సృష్టించింది. ఘాజీపూర్ పూల మార్కెట్ (Ghajipur flower market)లో ఓ బ్యాగులో అమర్చిన ఐఈడీ(IED)ని గుర్తించారు పోలీసులు. ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్సెక్యూరిటీ సిబ్బంది(National security Guard) ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు.
ఆ బ్యాగ్లో పేలుడు పదార్థం(IED) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్లో 3 కిలోల ఐఈడీ (IED) పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డులతో పాటూ, అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
The weight of recovered IED recovered from Ghazipur was approximately 3 kg. NSG received information from Delhi Police around 11 am and the explosive was defused around 1.30 pm: NSG
Visuals of forensic team from the spot. pic.twitter.com/VBWvWVa15u
— ANI (@ANI) January 14, 2022
ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ (Bhogi) నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది.
(The above story first appeared on LatestLY on Jan 14, 2022 06:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

