World Migration Report 2022: విదేశాలకు వెళుతున్న వారిలో మనమే టాప్, భారత్ను వదిలిన 1.80 కోట్ల మంది, పొట్టకూటి కోసం ఎడారి దేశానికే ఎక్కువగా వలసలు, ప్రపంచ వలస నివేదిక 2022లో సంచలన విషయాలు
విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని World Migration Report 2022 వెల్లడించింది. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు (India tops list of countries) విదేశాలకు వెళుతున్నారని నివేదిక తెలిపింది
New Delhi, Jan 24: విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని World Migration Report 2022 వెల్లడించింది. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు (India tops list of countries) విదేశాలకు వెళుతున్నారని ఐక్య రాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్(యూఎన్ డీఈఎస్ఏ) ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్’ పేరిట ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక (World Migration Report) వెల్లడించింది.
భారత్లో జన్మించి 2020 నాటికి విదేశాల్లో స్థిరపడినవారు 1.80కోట్లమంది ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వలసల వివరాలను వెల్లడించిన ఈ నివేదికలో భారతీయులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
2020నాటికి 1.80కోట్లమంది భారతీయులు విదేశాల్లో స్థిరపడ్డారు. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ 2020లో 7.20లక్షలమంది, 2021లో 8.30లక్షలమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లారు. 2020లో జూలై నాటికే 13లక్షలమంది విదేశాలకు వలస వెళ్లడం గమనార్హం. విదేశాలకు వలస వెళుతున్నవారిలో భారతీయుల తర్వాత మెక్సికన్లు (1.10కోట్ల మంది), రష్యన్లు(1.10కోట్లమంది), చైనీయులు (కోటిమంది), సిరియన్లు (80లక్షల మంది) వరుస స్థానాల్లో ఉన్నారు. ఆ తరువాత బంగ్లాదేశ్ (74 లక్షలు) స్థానంలో ఉంది.
భారతీయులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మొదటిస్థానంలో ఉంది. 2020నాటికి యూఏఈలో 35లక్షలమంది భారతీయులు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 27లక్షలమంది, మూడో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో 25లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్ దేశాలు ఉన్నాయి.
వలస వెళుతున్న భారతీయుల్లో 15శాతం మంది గమ్యస్థానం ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ (ఈసీఆర్) దేశాలే. అన్స్కిల్డ్ కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం ఈ 18 ఈసీఆర్ దేశాలకు వెళుతున్నారు. ఆ జాబితాలో బహ్రెయిన్, ఖతర్, ఒమన్, ఇండొనేషియా, సౌదీ అరేబియా, ఇరాక్, సుడాన్, జోర్డాన్, దక్షిణ సుడాన్, కువైట్, సిరియా, లెబనాన్, థాయిలాండ్, లిబియా, యూఏఈ, మలేషియా, యెమెన్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా వ్యాప్తికి ముందు 2019లో 5.9లక్షలమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు.
కరోనా ప్రభావంతో 2020లో 2.6లక్షలమంది మాత్రమే విదేశాలకు వెళ్లగా... 2021లో 4.4లక్షలమంది విదేశాల్లోని విద్యాసంస్థల్లో చేరారు. 2022లో విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022 జూన్ నాటికే 2.50లక్షలమంది విదేశాలకు వెళ్లారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు వెళుతున్న దేశాల్లో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో శాశ్వతంగా స్థిరపడేందుకు భారతీయులు గణనీయంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.
కోవిడ్ -19 ప్రయాణ పరిమితుల కారణంగా గ్లోబల్ మొబిలిటీ ఆగిపోయిన సమయంలో కూడా వలసల్లో అనూహ్యమైన పెరుగుదల ఉందని వెల్లడించింది. ప్రధానంగా మహమ్మారి కారణంగా వలసదారులు పంపిన అంతర్జాతీయ రెమిటెన్స్ 2019 నాటి $719 బిలియన్ల నుండి 2020లో $702 బిలియన్లకు తగ్గిందని నివేదిక పేర్కొంది.
బంగ్లాదేశ్ దాదాపు $21.75 బిలియన్లతో అత్యధిక రెమిటెన్స్ ఇన్ఫ్లో ఉన్న దేశాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2020 ప్రకారం 2018లో బంగ్లాదేశ్ టాప్ 10లో చేరలేదు.గత ఏడాది అత్యధిక చెల్లింపుల లబ్ధిదారులు భారత్ ($83.15 బిలియన్లు), చైనా ($59.51 బిలియన్లు), మెక్సికో ($42.7bn), ఫిలిప్పీన్స్ ($34.91bn), ఈజిప్ట్ ($29.60b), పాకిస్థాన్ ($26.11bn), ఫ్రాన్స్ ($24.48bn)గా ఉన్నాయి.
వలసదారులు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, సౌదీ అరేబియా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వెళుతున్నారని నివేదిక తెలిపింది. 2020లో ప్రపంచంలో దాదాపు 281 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారని IOM నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య 2020లో 60% తగ్గి 1.8 బిలియన్లకు పడిపోయింది (2019లో 4.5 బిలియన్ల నుండి తగ్గింది), అదే సమయంలో కరోనలో 40.5 మిలియన్లకు పెరిగింది (2019లో 31.5 మిలియన్ల నుండి).
అంతర్జాతీయ వలసదారుల సంఖ్య 1970లో ప్రపంచవ్యాప్తంగా 84 మిలియన్ల నుండి 2020 నాటికి 281 మిలియన్లకు పెరిగిందని, అయితే ప్రపంచ జనాభా పెరుగుదల కారకం అయినప్పుడు, అంతర్జాతీయ వలసదారుల నిష్పత్తి ప్రపంచంలోని 2.3% నుండి 3.6%కి మాత్రమే పెరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు (96.4%) వారు పుట్టిన దేశంలోనే నివసిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 24, 2023 12:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

