Kangana Ranaut Apologises: రైతులను క్షమాపణ కోరిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌, వివాదాస్పద రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి

రైతుల మీద తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Kangana Ranaut Apologises: రైతులను క్షమాపణ కోరిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌, వివాదాస్పద రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి
Kangana Ranaut (PIC@ Instagram)

New Delhi, Sep 26: . వివాదాస్పద రైతు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు చాలామందిని అసంతృప్తి, బాధకు గురి చేశాయని, దీనికి తనను క్షమించాలని ఆమె కోరారు. ‘కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు వేసింది. గతంలో రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలని నేను ప్రధాని మోదీని కోరుతానని చెప్పా.

పరువు నష్టం కేసులో శివసేన UBT ఎంపీ సంజయ్ రౌత్‌‌కు 15 రోజులు జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమానా విధించిన ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్

అయితే నేను చేసిన ఈ ప్రకటన చాలామందిని బాధించింది. నేను నా ప్రకటనను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబతున్నా. నేనొక బీజేపీ కార్యకర్తను. నేను చేసే ప్రకటనలు పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి తప్ప, వ్యక్తిగతంగా ఉండకూడదు’ అని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా, కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, వాటికి పార్టీతో సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Sep 26, 2024 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).