Puncture Mafia in Bengaluru: బెంగళూరు వాసులకు దడపుట్టిస్తున్న పంక్చర్‌ మాఫియా, బండి రోడ్డు మీదకు తీసుకువస్తే జేబుకు చిల్లులే..
Traffic in Hyderabad (Credits: Twitter/ANI)

బెంగళూరులో కొత్తగా పంక్ఛర్ల మాఫియా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఈ మాఫియా కారణంగా ప్రజల వాహనాల టైర్లకు తరచూ పంక్చర్లు పడుతున్నాయి. వాటిని రిపేర్లు చేయించుకునే క్రమంలో జనాల పర్సులు ఖాళీ అవుతున్నాయి. చీటికి మాటికి వాహనాలు పంక్చర్‌ అవుతుండటంతో ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. కొందరు వీధుల్లో మేకులు, ఇతర పదునైన వస్తువులు ఉంచి వాహనాల టైర్లు పంక్చర్లయ్యేలా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

ఫలితంగా, ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో రిపేర్లు చేయించుకునేందుకు వాహనదారులు క్యూకడుతున్నారట. ఈ క్రమంలో కొందరు దండిగా డబ్బులు సంపాదించుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తరచూ కిలోకు పైగా మేకులు, ఇనుప తీగలను తొలగిస్తున్నారు.

వంతెనపై ప్రేమజంట శృంగారం వీడియో వైరల్, అది మా పరిధి కిందకు రాదంటూ కొట్టుకుంటున్న రెండు పోలీస్ స్టేషన్ల అధికారులు

రహదారులు, దత్తపీఠానికి వెళ్లే మార్గంలోనే మేకులు వేసే మాఫియా యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఈ మాఫియా ఆట కట్టించగలమని అశోకనగర ఠాణాలో ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ అభిప్రాయపడ్డారు.