Karnataka Shocker: కాలేజీలో దారుణం, ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచిన యువకుడు,అదే కత్తితో తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నం, బాధితురాలు మృతి
కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా (Girl student stabbed to death) పొడిచాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు (attacker critical after suicide bid) ప్రయత్నించాడు.
Bengaluru, Jan 2: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా (Girl student stabbed to death) పొడిచాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు (attacker critical after suicide bid) ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీలో (Bengaluru Presidency College) చోటు చేసుకుంది. పోలీసులు, కాలేజీ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల లయస్మిత బెంగళూరు రూరల్ ప్రాంతంలో ఉన్న కాలేజీలో చదువుతున్నది.
పవన్ అనే విద్యార్థి మరో కాలేజీలో చదువుతున్నాడు. అయితే వీరిద్దరికి పరిచయం ఏర్పడటంతో ఓ రోజు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే మరో వ్యక్తిని ప్రేమిస్తున్న ఆ యువతి పవన్ ప్రేమను నిరాకరించింది. దీంతో లయస్మితపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. సోమవారం ఉదయం బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీ వద్ద ఉన్న లయస్మిత వద్దకు పవన్ వచ్చి తన వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆపై అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు.
తీవ్రంగా గాయపడిన ఆ యువతి రక్తం మడుగుల్లో పడి అక్కడే చనిపోయింది. గాయపడిన పవన్ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 02, 2023 04:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

