Kedarnath Temple Darshan: ఈ నెల 29న తెరుచుకోనున్న కేదార్నాథ్ తలుపులు, 16 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి, తీర్థయాత్ర తేదీలపై త్వరలో నిర్ణయం

హిందువులకు అత్యంత పవిత్రమైన చార్‌ధామ్‌ ఆలయాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Darshan) వచ్చే నెల తెరుచుకోనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Govt) వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29న కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుస్తున్నామని ఆలయ కమిటీ అధికారి ధృవీకరించారు.

Kedarnath Temple Darshan: ఈ నెల 29న తెరుచుకోనున్న కేదార్నాథ్ తలుపులు, 16 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి, తీర్థయాత్ర తేదీలపై త్వరలో నిర్ణయం
Kedarnath Temple covered with snow (Photo Credits: ANI)

Dehradun, April 22: హిందువులకు అత్యంత పవిత్రమైన చార్‌ధామ్‌ ఆలయాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Darshan) వచ్చే నెల తెరుచుకోనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Govt) వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29న కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుస్తున్నామని ఆలయ కమిటీ అధికారి ధృవీకరించారు. కరోనా దెబ్బ, షిర్డీ ఆలయం మూసివేత

దేశంలో COVID-19 మహమ్మారి కారణంగా, ఏప్రిల్ 29 న ఆలయ పోర్టల్స్ తెరిచినప్పుడు కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారితో సహా 16 మంది మాత్రమే హాజరవుతారు. తీర్థయాత్ర తేదీలు సాధారణంగా మహాశివరాత్రి తరువాత నిర్ణయించబడతాయి. సాంప్రదాయకంగా, ఓంకరేశ్వర్ ఆలయ పూజారులు, భీమాశంకర్ శివలింగ్ రావల్ మరియు ఇతరుల సమక్షంలో హిందూ పంచాంగ్ ప్రకారం తేదీలు నిర్ణయించబడతాయి.

Here's the tweet:

ఆలయ పోర్టల్స్ తెరిచినప్పుడు కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారితో సహా 16 మంది మాత్రమే హాజరుకావాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగేష్ ఘిల్డియల్ అన్నారు. COVID-19 సంక్షోభం నేపథ్యంలో భక్తుల కోసం 'దర్శనం' ఆలయంలో అనుమతించబడదని ఘిల్డియాల్ అన్నారు.కేదార్‌నాథ్ ఆలయం మే 14 నుంచి యాత్రికుల కోసం తెరుచుకుంటుందని, మే 15 నుంచి తెల్లవారుజామున 4 గంటలకు బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంటుందని ఏప్రిల్ 20 న ఉత్తరాఖండ్ సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ ప్రకటించారు. జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు, ముంబై, వారణాసిలో కొలువుతీరనున్న తిరుమల శ్రీనివాసుడు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు- కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్‌లను హిందువులు ఒక ముఖ్యమైన ప్రార్థనా స్థలంగా భావిస్తారు. అలకనంద నది ఎడమ ఒడ్డున నార్ మరియు నారాయణ్ అనే రెండు పర్వతాల మధ్య ఉన్న బద్రీనాథ్, సుందరమైన ప్రదేశాలకు కూడా ప్రసిద్ది చెందింది. ఇవే కాకుండా, చార్‌ ధామ్‌, పంచ కేదర్‌లలో ఒకటైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ కూడా ఉంది.

కేంద్ర నిబంధనల ప్రకారం కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామని, ఆయనతోపాటు మరో ఐదుగురు సహాయ సిబ్బందిని కూడా విడివిడిగా క్వారంటైన్‌ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించడంతో కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు భీంశంకర్ ఉత్తరాఖంఢ్ చేరుకున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో నివశించే ఆయన అక్కడి నుంచి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఉన్న ఉఖిమఠానికి చేరుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాల్సి ఉండడంతో అర్చకులను కూడా ప్రభుత్వం విడివిడిగా క్వారంటైన్ చేయనుంది. ఆలయంలో పూజాధికాలు ప్రారంభమయిన తర్వాత కూడా ఆయన ప్రజలతో భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని, ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటారని జస్టిస్ మంగేశ్ వివరించారు.

(The above story first appeared on LatestLY on Apr 22, 2020 04:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).