Madhya Pradesh Horror: భర్తను గొడ్డలితో నరికేసిన భార్య, అయినా కక్ష తీరక అతని ప్రైవేట్ పార్టులను కోసేసిన కసాయి, తాగొచ్చి వేధిస్తుండటమే కారణం
Representational Image. (photo credit- IANS)

Patna, March 3: భర్త వేధింపులకు విసుగు చెందిన ఓ మహిళ గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన దారుణ ఘటన (Madhya Pradesh Horror) మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆ తర్వాత ఆ మహిళ అతని ప్రైవేట్ పార్ట్‌లను నరికేసింది. నిందితురాలిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సమాచారం చుట్టుపక్కల వారిని కలచివేసింది.

ఇండియా టుడే ప్రచురించిన నివేదిక ప్రకారం , కంచన్ గుర్జార్ అనే మహిళ బీరేంద్ర గుర్జార్‌ను వివాహం చేసుకుంది. మాదకద్రవ్యాలకు బానిసైన బీరేంద్ర ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు. కంచన్ అతని ఐదవ భార్య. బీరేంద్ర నిత్యం వేధించడంతో నలుగురు భార్యలు అతన్ని విడిచిపెట్టారు. తన భర్త తరచూ మద్యం తాగి వచ్చి తనను చిత్రహింసలకు (Fed up of Harassment) గురిచేస్తున్నాడని నిందితురాలు తెలిపింది.

మేనల్లుడి ప్రైవేట్ పార్టులపై తుపాకీతో కాల్చిన మామ, సోషల్ మీడియాలో వీడియో వైరల్, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన

ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి బీరేంద్ర విందులో 20 నిద్రమాత్రలు కలిపినట్లు నిందితురాలు విచారణలో పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత కాంచన్ తన భర్తపై గొడ్డలితో దాడి (Wife Axes Drug-Addict Husband) చేసింది. ఈ దాడిలో బీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పదునైన ఆయుధంతో కంచన్ జననాంగాలను నరికేసింది. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడవేసే ముందు దుస్తులలో చుట్టింది. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతుడి బట్టలు, చెప్పులకు నిప్పంటించిందని నివేదిక పేర్కొంది.

విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హత్య చేసిన తర్వాత కంచన్.. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గుర్తు తెలియని వ్యక్తిపై కేసు పెట్టింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యపై సమగ్ర విచారణ చేపట్టారు. కంచన్, విచారణ సమయంలో తప్పించుకునే సమాధానాలు ఇవ్వడంతో, పోలీసులకు దొరికిపోయింది. అయితే, పోలీసులు విచారణను ముమ్మరం చేయడంతో ఆమె హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద మహిళపై కేసు నమోదు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.