Madhya Pradesh: ఆవును దొంగిలించాడని.. సగం గుండు గీసి, మీసాలు సగం తీసి, ముఖానికి నల్లరంగు వేసి దారుణమైన శిక్ష విధించిన గ్రామస్తులు, విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఆవును దొంగిలించాడనే ఆరోపణతో గ్రామస్థులు ఒక వ్యక్తి యొక్క సగం మీసాలు గీసి, సగం గుండు గీసి (Locals Half-Shave Man's Moustache) అతని ముఖాన్ని నల్లగా చేసి "శిక్ష" విధించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని మారుటల్ గ్రామవాసులు విధించిన ఈ విచిత్రమైన శిక్షను (Half-Tonsure Him as 'Punishment) ఆ వ్యక్తి అనుభవించినట్లు అధికారి ఒకరు తెలిపారు.

Madhya Pradesh: ఆవును దొంగిలించాడని.. సగం గుండు గీసి, మీసాలు సగం తీసి, ముఖానికి నల్లరంగు వేసి దారుణమైన శిక్ష విధించిన గ్రామస్తులు, విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు
Cow (Photo Credits: Pixabay)

Damoh, February 11: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఆవును దొంగిలించాడనే ఆరోపణతో గ్రామస్థులు ఒక వ్యక్తి యొక్క సగం మీసాలు గీసి, సగం గుండు గీసి (Locals Half-Shave Man's Moustache) అతని ముఖాన్ని నల్లగా చేసి "శిక్ష" విధించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని మారుటల్ గ్రామవాసులు విధించిన ఈ విచిత్రమైన శిక్షను (Half-Tonsure Him as 'Punishment) ఆ వ్యక్తి అనుభవించినట్లు అధికారి ఒకరు తెలిపారు.

కాగా "ఆ వ్యక్తి ఆవును దొంగిలించినట్లు ( Stealing Cow in Damoh) గ్రామస్థులు ఆరోపించారు. దాని తర్వాత గ్రామస్తుల బృందం అతని మీసాలు సగం తీసేసి, అతని తల సగం టోన్సర్ చేయాలని నిర్ణయించుకుందని పోలీస్ అధికారి తెలిపారు. గ్రామస్తులు అతని ముఖాన్ని నల్లగా చేసి, గ్రామం చుట్టూ తిరగమని బలవంతం చేశారని పోలీస్ అధికారి తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం ఆవు కనిపించకుండా పోయిందని, అనుమానం వచ్చిన గ్రామస్థులు సీతారాం అనే వ్యక్తిని పట్టుకోగా, తాను మరో వ్యక్తితో కలిసి జంతువును దొంగిలించానని తెలిపాడు. దీంతో గ్రామస్థులు అతనికి ఈ రకమైన శిక్షను విధించారు.

కులాంతర వివాహం చేసుకుంటే ఇంత దారుణమా, ఊరిలోకి రావాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని గ్రామపెద్దలు డిమాండ్, పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఆ తర్వాత, జబల్‌పూర్ నాకా పోలీస్ పోస్ట్‌కు ఇన్‌ఛార్జ్ ఆర్‌బి పాండే గ్రామానికి చేరుకుని నిందితుడిని స్టేషన్ కు తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించామని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Feb 11, 2022 08:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).