Pakistan BAT: క్రూరమైన చర్యకు పాల్పడిన పాక్, ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను తీసుకెళ్లిన దాయాది దేశం, విచక్షణా రహితంగా మోర్టార్లను ప్రయోగించిన పాకిస్తాన్, సరైన సమయంలో స్పందిస్తామని పాక్‌ను హెచ్చరించిన ఆర్మీ చీఫ్ నరవణే

దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన దుర్మార్గపు నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్‌ సైన్యానికి చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ)(Pak Border Action Team) అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను(Indian Porters) చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల (Indian army) తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది.

Pakistan BAT: క్రూరమైన చర్యకు పాల్పడిన పాక్, ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను తీసుకెళ్లిన దాయాది దేశం, విచక్షణా రహితంగా మోర్టార్లను ప్రయోగించిన పాకిస్తాన్, సరైన సమయంలో స్పందిస్తామని పాక్‌ను హెచ్చరించిన ఆర్మీ చీఫ్ నరవణే
Indian Army Chief Manoj Mukund Naravane. (Photo Credit: ANI)

Srinagar, January 13: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన దుర్మార్గపు నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్‌ సైన్యానికి చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ)(Pak Border Action Team) అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను(Indian Porters) చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది.

గతంలో భారత జవాన్ల (Indian army) తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికులకు నిత్యావసరాలను అందించే పోర్టర్లే లక్ష్యంగా పాక్‌ సైన్యం శుక్రవారం నాడు విచక్షణారహితంగా మోర్టార్లు ప్రయోగించింది.

ఈ మోర్టార్ల దాడిలో గుల్పూర్‌ సెక్టార్‌లోని కస్సాలియాన్‌ గ్రామానికి చెందిన పోర్టర్లు మొహమ్మద్‌ అస్లాం, అల్తాఫ్‌ హుస్సేన్‌(23) చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో అస్లాం(28) శరీరాన్ని ఛిద్రం చేసిన బీఏటీ అతని తలను వెంట తీసుకెళ్లిందని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశామని, వారి అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయని పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

భారత గూఢాచారులు జేమ్స్‌బాండ్ సినిమాల్లో లాగా గన్స్ పట్టుకుని తిరగరు

గాయపడిన పోర్టర్లు సలీం, షౌకత్, అహ్మద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. సైనికుడనే వాడెవడూ ఇలాంటి హేయమైన చర్యలకు దిగడనీ, వీటికి సరైన సమయంలో సైనికరీతిలో స్పందిస్తామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే (Army chief General MM Naravane) పేర్కొన్నారు.

పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే

సామాన్యులను పాక్‌ సైన్యం పొట్టనబెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాగా, సరిహద్దుల వెంట చొరబాటు, ఉగ్ర చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా ఏర్పాటైన బీఏటీలో పాక్‌ సైనికులతోపాటు( Pakistani army) ఉగ్రవాదులు(terrorists) కూడా సభ్యులుగా ఉంటారు.

(The above story first appeared on LatestLY on Jan 13, 2020 08:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).