Budget Session 2022: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాష్ట్రపతి కోవింద్ ప్రశంసలు, దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందని తెలిపిన రాష్ట్రపతి

పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ram Nath Kovind) ప్రసంగించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో (Budget Session 2022) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. కోవిడ్ -19 తో పోరాడగల భారతదేశ సామర్థ్యం దాని టీకా కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Budget Session 2022: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాష్ట్రపతి కోవింద్ ప్రశంసలు, దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందని తెలిపిన రాష్ట్రపతి
President Ram Nath Kovind. (Photo Credits ANI)

New Delhi, Jan 31: పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ram Nath Kovind) ప్రసంగించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో (Budget Session 2022) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. కోవిడ్ -19 తో పోరాడగల భారతదేశ సామర్థ్యం దాని టీకా కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సంవత్సరం లోపు, మేము 150 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ను అందించి రికార్డు సృష్టించాము. ఈ రోజు, ఇచ్చిన మోతాదుల సంఖ్య విషయానికి వస్తే మేము ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకరిగా ఉన్నామన్నారు.

ఇండియా గ్లోబల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా (Kovind lauds Centre’s welfare schemes) మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్‌ ఇండియాతో మొబైల్‌ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు. ఫసల్‌ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు.

7 మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్‌ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్‌ పేర్కొన్నారు. పీఎమ్‌గ్రామీణ సడక్‌ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు.

దేశంలో గత 24గంటల్లో 2,09,918 మందికి కరోనా, 959 మంది మృతి, ప్రస్తుతం 18,31,268 యాక్టివ్‌ కరోనా కేసులు

ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్‌ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సెంటర్‌ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి ముందు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, శాసనసభ్యులందరినీ స్వాగతిస్తూ, ఈ సెషన్ భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రపంచానికి చాటిచెబుతుందని అన్నారు. “నేటి ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌కు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ సెషన్ దేశం యొక్క ఆర్థిక పురోగతి, టీకా కార్యక్రమం మరియు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌ల గురించి ప్రపంచానికి విశ్వాసాన్ని కలిగిస్తుంది, ”అని ప్రధాన మంత్రి తెలిపారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అత్యంత ఆక్టేన్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ఈరోజు ప్రారంభమైంది. బడ్జెట్ సెషన్ ఏప్రిల్ 8న ముగియనుంది, ఇందులో మొదటి భాగం ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుంది. స్టాండింగ్ కమిటీ బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తున్నందున ఫిబ్రవరి 12 నుండి మార్చి 13 వరకు విరామం ఉంటుంది.

(The above story first appeared on LatestLY on Jan 31, 2022 12:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).