Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మంది సజీవ దహనం, ప్రైవేటు బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ, బార్మర్-జోధ్‌పూర్ హైవేపై విషాద ఘటన
Representational Image (Photo Credits: Twitter)

Jaipur, Nov 10: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై ప్రయివేటు బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో (Rajasthan Fire Accident) ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 5 మంది సజీవ దహనమై పోయారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 5 మృతదేహాలను (5 people burnt to death ) రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఒక ప్రయాణీకుడు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు ఉదయం 9:55 గంటలకు బలోత్రా నుండి బయలుదేరింది మరియు రహదారికి రాంగ్ సైడ్ నుండి వస్తున్న ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో (bus catches fire after colliding with tanker in Rajasthan) ప్రమాదం జరిగింది. ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని రక్షించారు. ప్రమాదం జరగడంతో జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

దూసుకొస్తున్న మరో సైక్లోన్ ముప్పు, తమిళనాడు వ్యాప్తంగా రెడ్ అలర్ట్, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, చెన్నైలో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు

ప్రమాద స్థలంలో పచ్‌పద్ర ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్, రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి సుఖ్‌రామ్ బిష్ణోయ్ కూడా ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మందిని బయటకు తీయగా, మిగిలిన ప్రయాణికుల గురించి ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.