Devotee Suffers Heart Attack in Ayodhya: అయోధ్యలో రామభక్తుడికి గుండెపోటు, సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన భారత వైమానిక దళం సిబ్బంది

సోమవారం అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమంలో ఒక భక్తుడు గుండెపోటును (Devotee Suffers Heart Attack in Ayodhya) ఎదుర్కొన్నాడు.గుండెపోటుకు గురైన ఆ రామభక్తుడి ప్రాణాలను భారత వైమానిక దళం సిబ్బంది కాపాడారు.

Devotee Suffers Heart Attack in Ayodhya: అయోధ్యలో రామభక్తుడికి గుండెపోటు, సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన భారత వైమానిక దళం సిబ్బంది
IAF (Photo-PTI)

సోమవారం అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమంలో ఒక భక్తుడు గుండెపోటును (Devotee Suffers Heart Attack in Ayodhya) ఎదుర్కొన్నాడు.గుండెపోటుకు గురైన ఆ రామభక్తుడి ప్రాణాలను భారత వైమానిక దళం సిబ్బంది కాపాడారు. ఎయిర్‌ఫోర్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించి వైద్యం (IAF's mobile hospital quick ) అందించడంతో రామకృష్ణ శ్రీవాస్తవ (65) అనే వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యి ఒక్కసారిగా కుప్పకూలాడు.

శ్రీరాముడికి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ, ఇన్ని శతాబ్దాలుగా ఈ కార్యం చేయలేకపోవడం మన లోటంటూ భావోద్వేగం

ఈ విషయాన్ని గమనించిన వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని భీష్మ్ క్యూబ్ బృందం తక్షణమే స్పందించి బాధితుడిని అక్కడే ఉన్న మొబైల్ ఆసుపత్రికి తరలించింది. అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో తీసుకెళ్లడంతో బాధితుడి ప్రాణాలను వైద్యులు కాపాడారు. ఒక గంట తర్వాత మెరుగైన వైద్యం కోసం అతడిని మరో ఆస్పత్రికి తరలించారు. అత్యంత కీలకమైన సమయంలో హాస్పిటల్‌కు తరలించడంతో రామకృష్ణ శ్రీవాస్తవ ప్రాణాలు నిలిచాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jan 22, 2024 06:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).